Skip to main content

అఖిలప్రియపై సొంత తమ్ముడు కోర్టుకెక్కడంలో అసలు కారణం ఇదే


భూమా అఖిలప్రియ మరో వివాదంలో  చిక్కుకున్నారా......ఆస్తికోసం సొంత తమ్ముడు .....సోదరిపైనే కోర్టుకెక్కాడా..... ఎప్పుడో 2016 లో  తండ్రి విక్రయించిన స్థలంపై  వాటా కోసం అఖిలప్రియ తమ్ముడు ఇప్పుడెందుకు కోర్టును ఆశ్రయించినట్టు....ఒకవేళ నిజంగా  ఆస్తికోసం  అక్కపై  కోర్టుకెక్కితే ఆమె ఇంట్లోనే ఎందుకు ఉంటారు.... ఆమె కుటుంబంతో కలిసి విహారయాత్రలకు ఎందుకు వెళతారు........దీని వెనుక ఎదైనా  హిడెన్ అజెండా  ఉందా....... అక్కపై తమ్ముడు  నిజంగా   కేసు పెట్టారా.... లేక ఫ్యామిలీ డ్రామానా? 


మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీద ఆమె సోదరుడు కోర్టుకు వెళ్లారు. భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూమా కుటుంబానికి హైదరాబాద్ శివారు గండిపేట వద్ద 1000 గజాల స్థలం ఉంది. అయితే, ఆ ఆస్తిని 2016లో విక్రయించారు. ఆ సమయంలో తాను మైనర్ అని తన తండ్రి భూమా నాగిరెడ్డి చెప్పడంతో వేలిముద్రలు వేశానని జగత్ విఖ్యాత్ రెడ్డి చెబుతున్నాడు. అప్పట్లో సుమారు రూ.2కోట్లకు ఆ భూమిని విక్రయించినట్టు తెలుస్తోంది. అయితే, మూడేళ్ల నాడు అమ్మిన ఆస్తిలో తనకు వాటా కావాలంటూ జగన్ విఖ్యాత్ రెడ్డి ఇప్పుడు కోర్టును ఆశ్రయించారని ప్రచారం జరుగుతోంది.


ఈ ప్రచారంపై కర్నూలు జిల్లావాసులు భూమా అభిమానులు తీవ్ర కలత చెందుతున్నారు. తన ఇద్దరు అక్కలపై భూమా కుమారుడు ఎందుకు కోర్టుకు ఎక్కారు..... ఎప్పుడో అమ్మిన భూమిపై వాటా కోసం ఇప్పడు పట్టుబట్టడం ఏంటని బుర్రలు పీకుంటున్నారు. తల్లిదండ్రుల మరణంతో భూమా కుటుంబానికి అఖిలప్రయ పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు...అటు  తమ  కుటుంబానికి అండగా నిలిచిన అభిమాన బలాన్ని కాపాడుకుంటూ .. ఇటు  రాజకీయ ప్రత్యర్ధులను ధీటుగా ఎదుర్కొంటుూ  ముందుకు సాగుతున్నారు. 


కొద్దిరోజుల క్రితం భూమా అఖిలప్రియ  భర్త భార్గవ్ రామ్ కేసులు వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లో కూడా భార్గవ్‌పై ఓ కేసు నమోదయ్యింది. ఇప్పుడు తాజాగా సొంత తమ్ముడు కోర్టుకు ఎక్కాడన్న వార్తలు  కర్నూలు , నంద్యాలలో హాట్‌టాపిక్ గా మారాయి.  మరోపక్క  తన  కుటుంబంపై జరుగుతున్న  ప్రచారంపై  జగత్ విఖ్యాత్ రెడ్డి  స్పందించారు. తాను దుబాయ్‌లో ఉన్నానంటూ  తమ కుటుంబం అంతా కలిసే ఉందని.. తమపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. దీంతో  భూమా కుటుంబంలో కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని తెలుస్తోంది. కేవలం భూమి కొనుగోలుదారులను ఇబ్బందిపెట్టేందుకే న్యాయవాదుల సలహా మేరకే విఖ్యాత్‌ కోర్టును ఆశ్రయించారని ఈ కేసును వాదిస్తున్న లాయర్‌ కూడా భూమా అఖిలప్రియ బంధువే అని సమాచారం.    అఖిలప్రియ స్పందించి నిజం ఏంటో  వెల్లడించాలని  అభిమానులు కోరుతున్నారు. 


 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.