Skip to main content

సింగరేణి ఏరియా ఎమ్మెల్యేల్లో గుబులు


వారంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు...కానీ నియోజక వర్గాల్లోకి వెళ్ళాలి అంటే భయపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తమకు ఇబ్బందిగా మారిందని ఆ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇంతకీ ఇబ్బందులు పడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు... ఏ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన వారు గుర్రుగా ఉన్నారు. మరి ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి?



అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం తమకు ఇబ్బందులు తెస్తున్నాయని వారంతా బాధపడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్లు ఉండొద్దని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ...ఆర్టీసీ యూనియన్లను రద్దు చేసి యూనియన్ ఆఫీసులకు తాళాలు వేయడంతో ఆ ప్రభావం తమపైన పడిందంటున్నారు గులాబీ పార్టీ  ఎమ్మెల్యేలు. అంతేకాదు సింగరేణి కార్మికులకు ఎన్నికలు నిర్వహించకుండా ఆలస్యం చేయడంతో సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని భయపడుతున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, రామగుండం, భూపాల పల్లి, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సింగరేణి కార్మికులకు ఎన్నికలు నిర్వహిస్తే బాగుండని అనుకుంటున్నారు. 



ఆర్టీసీ కార్మికుల సంఘాలను క్లోజ్ చేసినట్లే సింగరేణిలో కూడా కార్మికుల సంఘాలను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అందుకే ఇప్పటి వరకు సింగరేణి కార్మికులకు ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రచారం జరుగుతోంది. సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ సంఘం, సింగరేణి బొగ్గు గని కార్మిక  సంఘం కొంచెం వీక్ అవ్వడం బీజేపీ అనుబంధ సంఘం బియంయస్ బలంగా అవ్వడం కూడా ఒక కారణం అని అనుకుంటున్నారు. దీంతో సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవాలని అనుకుంటున్నారని సమాచారం.



సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవాలని అనుకుంటున్నారట. సింగరేణి కార్మిక సంఘాన్ని క్లోజ్ చేస్తే తమ పైన నియోజక వర్గాల్లో అసంతృప్తి పెరిగి రానున్న ఎన్నికల్లో  పార్టీ పైన ప్రభావం పడే ఛాన్స్ ఉందని ముఖ్యమంత్రి కి చెప్పాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇస్తారా....సింగరేణి కార్మిక సంఘాల పైన సీఎంకి ఎలాంటి అభిప్రాయం ఉందొ చూడాలి.


 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.