Skip to main content

మత స్వేచ్ఛ ఎలా ఉంటదో చెప్పవా ట్రంప్.. ప్లీజ్


 

భారత్ లో మత స్వేచ్ఛపై ట్రంప్ మాట్లాడతాడట. మత స్వేచ్ఛపై ఏం మాట్లాడతావు? భారత్ లో మత స్వేచ్ఛ ఉందంటావా? లేదంటావా? అమెరికా కన్నా ఎక్కువుందంటావా ?  లేక అసల్లేదంటావా ? ఏ దేశంలో అమల్లో ఉన్న మత స్వేచ్ఛను ప్రామాణికంగా తీసుకొని భారత్ లో మతస్వేచ్ఛను కొలుస్తావు బాస్?  

 

పేరులో ఇస్లామిక్ నేచర్ ఉన్నా, వేషధారణలో ఇస్లామిక్ కల్చర్ కనిపించినా భూతద్దం పెట్టి ఒళ్లంతా సెర్చ్  చేసే అమెరికాధీశుడు భారత్ లో మత స్వేచ్ఛ మీద మాట్లాడతాడట. మెక్సికో నుంచి వచ్చే శరణార్థులను అడ్డగించేందుకు నువ్వు ముళ్ల కంచెలు నాటుకుంటావు. అయినా అక్రమ వలసలు వరదలా పారుతుంటే 24 గంటల సెక్యూరిటీని అమలు చేసుకుంటావు. యూరోప్, మధ్య ప్రాచ్య దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా విపరీతమైన ఆంక్షలు పెడతావు. 

 


 

ఎయిర్ పోర్టుల్లో తలపాగా చుట్టుకున్న సిక్కును చూసినా ముస్లిం పౌరుడేమోనని జడుసుకుంటావు. క్లీన్ షేవ్ తో ఉన్న మా స్మార్ట్ హీరో భారతీయుడు కమల్ హాసన్ ని చూసినా పేరులో హసన్ ధ్వనిస్తుంది కాబట్టి బట్టలు విప్పించి మరీ ముస్లింను కాదని చెప్పేదాకా వదలిపెట్టకుండా.. ఇండియాలో హిందువును అని చెప్పని కమల్ చేత నువ్వు మాత్రం... నేను హిందువునే మొర్రో అని గొంతెత్తి అరిచేలా చేశాక గానీ.. అప్పుడు వదిలిపెట్టవు. నీ దగ్గర పిల్లిలా చేతులు ముడుచుకొని నువ్వు  పెట్టిన ప్రతి రూల్ ను కూడా తు.చ. తప్పకుండా  పాటించాక.. ఇండియా తిరిగొచ్చిన ఇండియన్ మేధావులు ఇండియాలో మాత్రం ముస్లింలకు ఏదో అన్యాయం జరుగుతుందని ఆత్మవంచన చేసుకుంటే మళ్లీ మీ అమెరికన్ మీడియానే, అగ్రరాజ్యాల మీడియానే ఇండియాలో కొంపలంటుకుపోతే చూస్తూ ఊరుకోమని వార్నింగ్  లు ఇస్తారు. 

 

ఇంతకీ భారత్ లో మత స్వేచ్ఛ మీద ఏం మాట్లాడుతావు? నీకు  బాగా జాన్, జిగర్ అని నువ్వే చెప్పుకునే మా నరేంద్ర మోడీ అచ్చుగుద్దినట్లు నీలాగే చేస్తుంటే చూడాలని ముచ్చట పడుతున్నావా ? లేక నీకన్నా ఇంకో ఆకు ఎక్కువే చదివినట్టు సరిహద్దుల్లో మరింత పటిష్టంగా పర్ఫామెన్స్ చూపించాలని కోరుకుంటున్నావా ?  నీకన్నా తక్కువ పర్ఫామెన్స్ చూపిస్తే మత స్వేచ్ఛ విపరీతంగా ఉందని, నీ కన్నా ఎక్కువ ప్రతిభ కనబరిస్తే రూల్స్  కఠినంగా ఉన్నాయని, ఇండియాలో పాకిస్తాన్ జిందాబాద్ అని పలికే బయటి దొంగలకు కొందరు ఇంటిదొంగలు మద్దతిచ్చినా చూసీ చూడనట్టు వదిలేయడమే అసలైన మత స్వేచ్ఛ అని ప్రకటిస్తావా ? 

 

అందుకే ట్రంప్.. ఇప్పటివరకు అనేక దేశాల పౌరులకు, శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిన ఇండియా.. ఇవాళ నువ్వు చెప్పే మత స్వేచ్ఛ  కొత్తగా ఎలా ఉంటుందో వినాలని తహతహలాడుతున్నారు. చివరికి నా దేశం మీదనే దండెత్తిన సంతతిలో కూడా అక్బర్ ది గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్ అని గొప్పగా చెప్పుకుంటున్నాం. వారిలో లేని సుగుణాలను కూడా వెదికి మరీ గానం చేసి ఆనందబాష్పాలు రాలుస్తూ ఆహా... నా దేశంలో ఐకమత్యం ఎంతగొప్పగా విరాజిల్లుతోంది.. దేశమంటే ఇలా ఉండాలి. ఇలాగే ఉండాలి.. అని రొమ్ములు విరుచుకొని ప్రపంచానికే ఆదర్శం ఇండియా అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నీకు స్వాగతం పలికిన 130 కోట్ల మంది నా దేశ పౌరులు.. నువ్వు కొత్తగా చెప్పే మత స్వేచ్ఛ ఎలా ఉంటుందో వినాలని కోరుకుంటున్నారు. కొంచెం అర్థమయ్యేలా చెప్పవా ? ప్లీజ్. 

 

 

Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.