Skip to main content

గత్తర లేపుతున్న కరొనా... గడప ముందుకొచ్చింది


ప్రపంచాన్ని వణికిస్తున్న కరొనా వైరస్ ఇండియాకు రానే వచ్చింది. మొన్ననే కేరళలో ముగ్గురు యువకులకు సోకినట్లు కన్ఫామ్ అయినప్పటికీ ట్రీట్ మెంట్ తరువాత వారిని డిశ్చార్చ్ చేశారు. వారిని యథేచ్ఛగా బయట తిరగరాదని హెచ్చరించి వదిలారు. అలాగే విదేశాలకు వెళ్లేవారు యథేచ్ఛగా వెళ్లరాదని స్ట్రిక్టుగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలా మంది విమానయానాలు రద్దు చేసుకున్నారు. అత్యవసరం అయితే తప్ప.. కరొనా వైరస్ భయానికి ఎవరూ విమాన ప్రయాణాలు చేయడం లేదు. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సైతం అతలాకుతలం అవుతోంది. అయితే తాజాగా మరో ఇద్దరికి కరొనా వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. మొన్నటిదాకా కరొనా వైరస్ ను లైట్ తీసుకున్న ప్రజలు.... ఇప్పుడు చాలా భయపడుతున్నారు. తరచుగా ఇటలీ వెళ్లే ఒక ఢిల్లీవాసి, తరచుగా దుబాయికి వెళ్లే తెలంగాణ వాసి... ఈ కరొనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరు ఇండియాలో ఐదుగురికి కరొనా వైరస్ సోకినట్టు అధికారికంగా గుర్తించినట్టయింది. మరి ఈ సంఖ్య ఇక్కడితో ఆగిపోతుందా.. అలా జరక్కపోతే ఇండియా పరిస్థితి ఏంటి... చైనాలో మాదిరిగా కొన్ని గంటల్లోనే మనకు ఓ స్టేడియాన్ని హాస్పిటల్ గా మార్చే సామర్థ్యం గానీ, వెసులుబాట్లు గానీ ఉన్నాయా... ఈ విషయంలో మనం చాలా పూర్. మన ఇండియన్ల మనస్తత్వాలు, నిర్లక్ష్యపూరిత వ్యవహారం వంటి అంశాలను బట్టి చూస్తే వైరస్ సోకకుండా నిరోధించుకోవడం తప్ప.. వైరస్ వ్యాపించకుండా అరికట్టడం అంత సులువు కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.



చైనా కన్నా మనం ఎంతో నయం


మంచికైనా, చెడుకైనా మన పక్కనున్న చైనాతో పోల్చుకోవడం చాలా కామన్. అదే ప్రకారంగా చూసుకుంటే చైనా కన్నా మన ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక పునాదులు చాలా విభిన్నమైనవి. ఆ లెక్కన చూసుకుంటే మన ఇండియాలో కరొనా వైరస్ వ్యాప్తి చెందడం అంత సులువు కాదన్న పాజిటివ్ సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే వైరస్ సొకినవారు వారికి  తెలిసో తెలియకో, కన్ఫామ్ కాకముందో వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తే గనక అది ఉపద్రవంగా మారే ప్రమాదాన్ని కొట్టిపారేయలేం. కానీ.. సాధారణ పరిస్థితుల్లో అయితే మాత్రం వైరస్ సోకినివారిని ఎవరితో కలవనీయకుండా చేస్తే కరొనా వైరస్ ఇండియాలో వ్యాప్తి చెందడం అసాధ్యమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


Photo: Financial Express


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.