Skip to main content

మోడీ సోషల్ మీడియా వదిలేస్తే ఏమౌతుంది?


 


ప్రధాని మోడీ సోషల్ మీడియా అకౌంట్లకు స్వస్తి పలుకుతారన్న ప్రకటన సోషల్ మీడియాలో కలకలమే రేపుతోంది. ఎందుకంటే కోట్లాది  మంది ఫాలోయర్లు మోడీకి ఉన్నారు. ఈ విషయంలో మన దేశంలో మోడీనే టాప్ లో ఉండడం గమనించాల్సిన అంశం. అంతమంది ఫాలోయర్స్ ను పెట్టుకొని అకౌంట్స్ ని వదిలేసేందుకు సిద్ధమవడం చాలా గొప్ప విషయమే కాక ఆలోచించాల్సిన విషయం కూడా. 


మోడీ సోషల్ మీడియాను వదులుకోవడానికి కారణాలు ఇవీ - 


1) సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ చాలావరకు న్యూస్ ని స్ప్రెడ్ చేయడమే తప్ప.. వాటి మీద కంట్రోల్ లేకపోవడం. ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్ బుక్. 


2) కంట్రోల్ చేయాలనుకున్నా చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం. ముఖ్యంగా అందుకోసం చిత్తశుద్ధి లేకపోవడం. 


3) వన్ బిలియన్ ప్రజల మార్కును దాటిన భారత్ లో దాదాపు 50 శాతానికి పైగా ప్రజలు నిత్యం ఆన్ లైన్ లోనే ఉంటున్నారు. దీంతో నెట్ వర్క్ బిజినెస్ లో ఇండియాది పైచేయిగా మారుతోంది. దీన్ని బిజినెస్ అవకాశంగా మలుచుకుంటున్న సోషల్ మీడియా బాసులు రూమర్స్ అంశాన్ని అసలేమాత్రం పట్టిించుకోవడం లేదు. పైగా ఆ రూమర్స్ నే బిజినెస్ పాయింట్ గా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు ఇటీవలి కాలంలో విపరీతంగా వినిపిస్తున్నాయి.


4) భారత్ తీసుకుంటున్న చాలా నిర్ణయాల విషయంలో సోషల్ మీడియా బాధ్యతగా వ్యవహరించడం లేదు. 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు జమ్మూ-కాశ్మీర్ లో శాంతియుత వాతావరణం కోసం చేసిన ప్రయత్నాలను కాకుండా చిన్నచిన్న ప్రదర్శనలకు అధిక ప్రయారిటీ ఇచ్చి అభూత కల్పనలు ప్రచారం చేసింది. అలాంటి అభూతకల్పనలన్నీ ఫేక్ అకౌంట్ల ద్వారానే జరిగిన విషయం రుజువైంది. కానీ ట్విట్టర్ యాజమాన్యం మాత్రం దేశ ప్రజల సెంటిమెంట్స్ ను పట్టించుకోలేదు. ఫేక్ అకౌంట్లను కట్టడి చేయలేదు. అలాగే అక్కడున్న వాస్తవాన్ని ప్రపంచానికి చెప్పేందుకు ప్రయత్నం  కూడా చేయలేదు. 


5) అమెరికా అధ్యక్షుడి ఎన్నికల సందర్భంలో ఫేస్ బుక్ అకౌంట్ హోల్డర్ల సమాచారాన్ని భారీ మొత్తానికి అమ్ముకున్నారన్న ఆరోపణలు జుకర్ బర్గ్ మీద ఉండనే ఉన్నాయి. ఇది గమనించాల్సిన అంశం. 


 


మోడీ లాంటి వారు వదిలేస్తే మంచిదే - 


ప్రపంచంలో అత్యధిక ఫాలోయర్లు ఉన్న నరేంద్ర మోడీ సోషల్ మీడియా అకౌంట్లు వదిలేస్తే అది ఓ మంచి సంప్రదాయమే అవుతుంది. కనీసం ఇప్పుడైనా ఆయా యాజమాన్యాలు పునరాలోచన చేసే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా అనేది వ్యక్తిగత అభిప్రాయాలకు వేదిక. అందులో ఎవరికి తోచింది వారు రాసుకుంటారు. నచ్చినవాళ్లు యాడ్ అవుతారు. నచ్చనివారు లెఫ్ట్ అయిపోతారు. ఎవరికీ లాభ-నష్టాలతో పనిలేదు. బాధ్యతల పట్టింపు అసలే ఉండదు. నా అకౌంట్ - నా ఇష్టం అన్నట్టుగా రాతలు, కూతలు సాగిపోతుంటాయి. ఒకర్ని నియంత్రించే అధికారం ఇంకొకరికి ఉండదు. ఇప్పుడు ఇదో పెద్ద సవాలై కూర్చుంది. 


ప్రత్యామ్నాయం ఏంటి?


అయితే మోడీ తన అకౌంట్లను వదిలేస్తాను అంటూనే ప్రజలతో టచ్ లో ఉంటాను అనడం మాత్రం ఆసక్తి రేపుతోంది. ఏ విధంగా టచ్ లో ఉంటారు.. రేడియో, దూరదర్శన్ లాంటివాటిని ఎక్కువగా ఉపయోగించుకుంటారా.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) వంటివాటిని సోషల్ మీడియాలోకి తీసుకొస్తారా.. లేక మరేదైనా ప్రత్యామ్నాయాన్ని ఇప్పటికే ఆలోచించి పెట్టారా..  అన్నది చాలా ఆసక్తిగా మారింది. బాధ్యత లేని సోషల్ మీడియాను నిషేధించి, బాధ్యతగా ప్రవర్తించే జనరల్ మీడియాను అమితంగా ప్రోత్సహిస్తారా? అదే జరిగితే జనరల్ మీడియాకు మంచిరోజులు వచ్చినట్టే. జనరల్ మీడియాలోకి ఇప్పటికే ఎఫ్.డి.ఐ. లకు  పూర్తి పర్మిషన్ ఇచ్చిన మోడీ మనసులో ఇంకెలాంటి ఆలోచనలున్నాయో వేచి చూడాలి. అయితే మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా వారి సేవలను, త్యాగాలను హైలైట్ చేస్తూ తన అకౌంట్లను వారు గానీ, వారి తరఫున కథనాలు గానీ పోస్ట్ చేసేవారు టేకోవర్ చేసుకునే అవకాశం కల్పించడం మాత్రం వినూత్నమైన ఆలోచన. 


Photo: pragativadi


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.