Skip to main content

చైనా పెట్టుబడులకు ఇండియా చెక్


Photo: cnn.com

కరోనా పుణ్యమా అని భారత్ ఆలస్యంగానైనా కళ్లు తెరిచింది. మన సరిహద్దుల్ని ఆనుకునే ఉన్న డ్రాగన్ కంట్రీ కుట్రపూరితమైన ఆర్థిక సామ్రాజ్యవాదానికి తొలి చెక్ పెట్టింది. కరోనా మహమ్మారిని కట్టడి చేస్తున్న ఆపరేషన్లో భాగంగానే హుటాహుటిన ఎఫ్.డి.ఐ పాలసీని సవరించింది. దీని ప్రకారం మన దేశ సరిహద్దులు ఆనుకొని ఉన్న దేశాలు ఇకపై నేరుగా భారత్ లోని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం గానీ, పెట్టుబడులు పెట్టడం గానీ చేయడానికి వీల్లేదు. అలాగే భారత్ లోని కంపెనీలు కూడా యాజమాన్య హక్కుల బదలాయింపులు గానీ, కంపెనీల విస్తరణ గానీ, నూతన భాగస్వాములు, పెట్టుబడుల సేకరణ విషయంలో మన సరిహద్దుల్ని ఆనుకొని ఉన్న దేశాలతో కుదుర్చుకోవాలంటే భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. తాజా ఎఫ్.డి.ఐ నిబంధనల సవరణ ప్రధానంగా చైనాను, అది విసిరే ఆర్థికపరమైన పెను సవాళ్లను ఎదుర్కోవడానికేనని భావిస్తున్నారు. 

 

చైనాను పూర్తిగా నమ్మి పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచి ఇటలీలోని దేశీయ ఇండస్ట్రీని చేజేతులా నాశనం చేసుకున్న ఆ దేశం.. చాలా ఆలస్యంగా ఆ విషయాన్ని గుర్తించింది. కరోనా విజృంభించి శవాల దిబ్బగా మారిన తరుణంలోనే ఇటలీ పునరాలోచనలో పడింది. ఇటలీతో పాటు అదే స్థాయిలో దెబ్బతిన్న స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా చైనాతో వ్యాపార సంబంధాలపై కొత్తగా ఆంక్షలు విధించాయి. ఇప్పుడిదే అదునుగా భారత్ కూడా చైనా పెట్టుబడులకు చెక్ పెట్టింది. దీంతో చైనాలోని ఏ కంపెనీ, ఇండియాలోని ఏ కంపెనీతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుంటుంది? ఎంత పెట్టుబడి పెడుతుంది? దాని ఉత్పత్తులు ఏంటి? అనే కీలకమైన సమాచారం తెలుసుకునే వీలుంది. ఇప్పటివరకు ఇది ఉండేది కాదు. 

 

ఇప్పుడున్న ఎఫ్.డి.ఐ. నిబంధనలు అనుమతిస్తున్న ప్రకారం భారత్ లో ప్రతి 30 చిన్నతరహా కంపెనీల్లో 18 కంపెనీలకు చైనా పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని, ఇకపై అలాంటి అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. 2000 నుంచి 2019 వరకు 2.34 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (దాదాపు 15 కోట్లు) ప్రవహిస్తే, అదే బంగ్లాదేశ్ నుంచి 48 లక్షలు, నేపాల్ నుంచి 18 కోట్లు, మయన్మార్ నుంచి 35 కోట్లు, అఫ్ఘనిస్తాన్ నుంచి 16 కోట్లు వచ్చాయి. ఇక పాకిస్తాన్, భూటాన్ నుంచి ఎలాంటి పెట్టుబడులూ రాలేదు. ఇటీవల భారత్ లోని ప్రధాన ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్.డి.ఎఫ్.సి లోకి 1 శాతం పెట్టుబడులు పెంచడాన్ని భారత్ అనుమానిస్తోంది. చైనా ఇతర దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలతో లబ్ధి పొందేది, పెట్టుబడులు పెట్టేది ఆ దేశంలోని కమ్యూనిస్టు పార్టీ నేతలేనని భారత్ ఎప్పుడో గుర్తించింది. ఇలాంటి పెట్టుబడులు భారత్ కు తెలిసి, అధికారికంగా, అనుమతుల ద్వారా వచ్చినవి కావు. మన దేశంలోని చిన్న కంపెనీలతో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకొని పెట్టిన పెట్టుబడులు. దక్షిణాసియా మీద కన్నేసినా చైనా ఇప్పటికే హిందూ మహాసముద్రాన్ని ఆనుకున్న దేశాలను గుప్పిట్లో పెట్టుకునేందుకు అనేక ఎత్తుగడలు వేస్తోంది. ఈ క్రమంలోనే సరిహద్దు నిబంధనలు ఉపయోగించుకొని భారత్ లోకి దొడ్డిదారిన పెట్టుబడులు గుమ్మరించే యోచనలో ఉందని ఇటీవలి అనుభవాల్ని బట్టి భారత్ బలంగా అనుమానిస్తోంది. 

 

చైనా కదలికల మీద ఓ కన్నేసి ఉంచిన భారత్ కరోనా ప్రభావం కారణంగా నూతన పాలసీలు తీసుకురావడం మొదలు పెట్టిందని ఈ నిర్ణయంతో చెప్పకనే చెబుతోంది. ఆ నిర్ణయం కూడా చైనాతోనే మొదలుపెట్టడం.. ప్రపంచ దేశాలకు తానొక ప్రపంచ ఆర్థిక శక్తి అన్న సంకేతాలు పంపేందుకే అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అటు సెబీ కూడా భారత్ లోని అన్ని కంపెనీలకు పెట్టుబడుల ప్రవాహంపై వివరాలు కోరడం గమనించాల్సిన అంశం.  ఈ పరిణామంతో చైనా వస్తువులు ఇకపై ఇండియా మార్కెట్ లోకి ఇబ్బడిముబ్బడిగా వచ్చే వీలుండదు. చైనా పెట్టుబడుల కోసం అర్రులు చాచే భారత్ లోని కొందరు పెట్టుబడిదారులకు చెక్ పకడుతుంది. స్వలాభాల కోసం సులువైన భారత మార్కెట్ మీద చైనా పెత్తనానికి బ్రేక్ పడుతుంది. అయితే ఎఫ్.డి.ఐ నిబంధనల సవరణ అనేది తొలి అడుగేనని, లాక్ డౌన్ నుంచి బయట పడ్డాక మరిన్ని పటిష్టమైన నిర్ణయాలు వెలువడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

 

Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.