Skip to main content

ట్విట్టర్ ను నిషేధించాలంటున్న కంగనా


బాలీవుడ్ భామ కంగనా రనౌత్ అపర కాళికావతారం ఎత్తింది. ఈ ట్విట్టర్ పిట్ట గొంతు పిసికేయాలని ప్రధాని నరేంద్రమోడీ సర్కారుతో వినమ్రంగా వేడుకుది. సోషల్ మీడియా పోస్టుల్లో కూడా పక్షపాతం చూపిస్తే.. అలాంటి సామాజిక మాధ్యమాలు అరాచకాలు సృష్టిస్తాయి మహా ప్రభో... తక్షణమే ట్విట్టర్ గాణ్ని నిషేధించిపారెయ్యండి... అంటూ ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో రికార్డు చేసింది. 


ఉన్న భావస్వేచ్ఛను హుందాగా వాడుకునేవారితో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అదే భావస్వేచ్ఛను ఉపయోగించుకొని చేసిన సామాన్య కామెంట్లకు కూడా లౌకికత్వం మంటగలిసిపోతోందని ఇల్లెక్కి లొల్లి చేసే వాళ్లతో వేగడం ఎవరికైనా సాధ్యమేనా? ఈ విషయంలోనే కంగనాకు కాలుకొచ్చింది. తబ్లిగీ జమాత్ కు వెళ్లినవారికి వైద్య పరీక్షలు చేసేందుకు డాక్టర్లు, వారిని కన్విన్స్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినా కొందరు తబ్లిగీ తమ్ముళ్లు.. తమను కాపాడేందుకే ప్రభుత్వాధికారులు ఎడతెరిపి లేని ప్రయత్నాలు చేస్తున్నారని గ్రహించక.... వారి మీద దాడులకు తెగబడుతున్నారు. దీనిమీదనే కంగనా చెల్లెలు.. రంగోలీ తన ట్విట్టర్ అకౌంట్ లో డాక్టర్ల మీద, పోలీసుల మీద దాడులకు తెగబడుతున్నవారిని కాల్చేపారేయాలని ట్వీటింది. ఆ ట్వీట్ ను ఆసరా చేసుకున్న బాలీవుడ్ క్యారెక్టర్లు.. ఫరా ఖాన్ అలీ, రీమా కగ్తీ.. అది ముస్లింలను డైరెక్టుగా, వారిని ఊచకోత కోయాలని రంగోలీ ట్వీటిందని వీళ్లు ట్వీటారు. ఆ ట్వీట్ మీద మరికొందరు అత్యుత్సాహవంతులు రంగోలీ మీద చెలరేగిపోవడంతో ట్విట్టర్ వాడు కాస్తా ఆమె అకౌంట్ ను ఊడపీకాడు. దీంతో కంగనాకు చిర్రెత్తుకొచ్చి ఈ విధంగా వీడియో చేసి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. అదిప్పుడు వైరల్ అవుతోంది.


Also Read: దేశద్రోహం కేసులో బెయిల్ రాకపోతే ముస్లింల పట్ల వివక్ష అవుతుందా?


ఇండియాకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నవాళ్ల అకౌంట్లు సేఫ్ గా ఉంటాయి.. మోడీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నవాళ్ల అకౌంట్లు కూడా సేఫ్ గా ఉంటాయి.. అమిత్ షా, ఆర్ఎస్ఎస్ వంటి గొప్ప వ్యక్తులను, సంస్థలను టెర్రరిస్టులుగా చిత్రిస్తున్నవాళ్ల అకౌంట్లు కూడా సేఫ్ గా ఉంటాయి.. కానీ పోలీసులు, వైద్యుల మీద దాడి చేస్తున్నవారిని షూట్ చేయాలన్నవారు దేశద్రోహులా? వారి అకౌంట్లను డిలీట్ చేసే ఇలాంటి సోషల్ మీడియా సంస్థలు మన దేశంలో అవసరమా? అంటూ ఆవేశంగా ప్రశ్నించింది కంగనా. 
తాను గానీ, తన చెల్లెలు గానీ ముస్లింలకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని, వైద్యుల మీద, పోలీసుల మీద ముస్లింలు దాడి చేస్తున్నారని, వారిని షూట్ చేయాలని ఎక్కడ అన్నారో నిరూపించాలని సవాల్ విసిరింది. మరి కంగనా మాట్లాడింది రైటే కదా. భావ స్వేచ్ఛ అనేది అందరికీ సమానంగా వర్తిస్తుంది కదా. ఫలానా స్కూల్లో చదువుకున్నంత మాత్రాన తాము ఒక్కరికే భావస్వేచ్ఛ వర్తించాలని, అది వాడుకున్న వేరే ఎవరైనా దేశద్రోహులేనని ఎక్కడైనా రాసి ఉందా? మరి దీనికి ట్విట్టర్ సమాధానం చెప్తుందా... లేక భావ స్వేచ్ఛ బ్యాచ్ సమాధానం చెప్తుందా? వేచి చూద్దాం. 


Ref: Kangana Ranaut Asks Govt to ‘Demolish’ Twitter In India


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.