Skip to main content

ఆఖరు కేజీ వరకు వరి కొనుగోలు చేస్తాం - మంత్రి వేముల


 


ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు చివరి కేజీ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళనకు గురికావద్దని, రాష్ట్ర రోడ్లు-భవనాలు,హౌసింగ్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని, చెప్పుడు మాటలు విని ఎవరూ అధైర్య పడొద్దని మంత్రి భరోసా ఇచ్చారు.కరోనా వైరస్ వల్ల రైతులెవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటు చేశామని, నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతోందని, గురువారం ఒక్క రోజే 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉండగా.. అందుకు మొత్తం 355 కొనుగోలు కేంద్రాలకు పర్మిషన్ ఇచ్చామని, గురువారం 336 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరిగిందన్నారు.పెట్టుకున్న అంచనాకు 30 శాతం అంటే 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ 336 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, సేకరించిన వరి ధాన్యంలో 92% అంటే 1.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లర్లుకు పంపడం జరిగిందన్నారు. ఈరోజు వరకు రూ. 123 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు చెల్లించడం జరిగిందన్నారు.


జిల్లాలో నియోజకవర్గాలవారీగా సేకరించిన వరి ధాన్యంలో నిజామాబాద్ రూరల్ లో 86%, బాల్కొండలో 85%, ఆర్మూర్ లో 87%, బోధన్ లో 98%, బాన్సువాడలో 99% రైస్ మిల్లర్ల దగ్గర అన్ లోడ్ అయిందన్నారు. ట్రాన్స్పోర్ట్ కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గురువారం 25 అదనపు వాహనాలు సమకూర్చారు.గడిచిన 24 గంటల్లో 504లారీల్లోని ధాన్యం రైస్ మిల్లర్లు అన్లోడ్ చేసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.ధాన్యం చెడిపోయిందన్న సాకుతో కానీ, కడతా పేరుతో కానీ రైస్ మిల్లర్లు రైతులను మోసం చేస్తే  కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.


77 మంది వైద్య సిబ్బంది గడువు పొడిగింపు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 77 మంది వైద్య సిబ్బందికి ఏప్రిల్ నెలాఖరుతో ముగిసిన ఫారెన్ సర్వీస్ డిప్యూటేషన్ (ఎఫ్‌ఎస్‌డీ) గడువును ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని రాష్ట్రమంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. గడువు ముగిసిన వీరంతా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ కష్ట సమయంలో జీజీహెచ్‌లోనే వీరి సేవలు కొనసాగాలని, ప్రజలకు మెరుగైన మరింత వైద్యం అందాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి వారిని ఇక్కడే ఉండి సేవలందించేలా చేసినట్లు రాష్ట్రమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. 


 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.