Skip to main content

డాక్టర్ల నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక


ఓపికకు కూడా హద్దుంటుంది కదా. అదే ఇప్పుడు ముందుకొస్తోంది. కరోనా విజృంభణకు బ్రేకులు వేసేందుకు ముందువరుసలో ఉండి పోరాడుతున్న వైద్యసిబ్బందిలో నిరసన సెగలు రగులుతున్నాయి. కరోనా పాజిటివ్ బారిన పడిన కొందరు వ్యక్తులు, హైడింగ్ లో ఉండడమే కాక.. పోలీసుల ద్వారా ఐడెంటిఫై అయ్యాక డాక్టర్లు వెళ్లినా కూడా విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. విచక్షణ కోల్పోయి వైద్యుల మీద దారుణంగా దాడులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో, నిజామాబాద్ లో జరిగినా ప్రభుత్వం వైపు నుంచి చెప్పుకోదగ్గ చర్యలు లేకపోవడం వైద్యసిబ్బందిలో ఆందోళనకు కారణమవుతోంది. ఆ రెండు సంఘటనల తరువాత కూడా OGH వైద్యుడిపై రక్తం వచ్చేలా కొట్టిన ఘటన జరిగింది. వైద్య సిబ్బంది మీద దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న సర్కారు ప్రకటనలు కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోయాయి. అటు యూపీలో కూడా డాక్టర్ అగర్వాల్ పై, అతని అనుచరులు, డ్రైవర్ పై విచక్షణ లేకుండా దాడి చేశారు. మీ ప్రాణాలు కాపాడేందుకే వచ్చామని చెబుతున్నా మూర్ఖత్వం తలకెక్కిన పాజిటివ్ రోగులు వాళ్ల వెహికల్ పై రాళ్లవర్షం కురిపించారు. చివరికి రోగులు ఉండాల్సిన హాస్పిటల్ బెడ్ మీద డాక్టర్లు ఉండాల్సి వస్తోంది.


Also Read: వదిలేస్తే వల్లకాడే - ఈ లెక్కలే సాక్ష్యం



అందుకే ఈ విషయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తొలిసారిగా స్పందించింది. డాక్టర్లపై దాడులు జరిగితే తమ విధులు నిర్వర్తించలేమని, ఆ దిశగా ప్రభుత్వాలు సరైన రక్షణ ఏర్పాట్లు చేయాలని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు రాజన్ శర్మ విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి 9 గంటలకు అన్ని ఆస్పత్రులు, వైద్య సిబ్బంది దీపాలు వెలిగించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. తాము నిరసన తెలుపుతున్నామే తప్ప వైద్యసేవలు నిలిపివేయడం లేదని.. అయితే తాము ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులను దేశమంతా ఇప్పటికైనా గుర్తించాలని ఆయన కోరారు. అలాగే కరోనాకు దేశాలవారీగా, ప్రాంతాలవారీగా స్పందించే లక్షణం ఉండదని, ప్రపంచవ్యాప్తంగా దీని వ్యాప్తి అంతా ప్రమాదకరంగానే ఉందని.. అలాంటప్పుడు కరోనాను దృష్టిలో పెట్టుకొని లాక్ డౌన్ నిబంధనలు ఒకేరకంగా ఉండాలని కేంద్రప్రభుత్వానికి సూచించారు. మరి.. ఈ ఐఎంఏ నుంచి ఈ సూచనను కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక హెచ్చరికగా పరిగణిస్తాయా.. రేపటిరోజుల్లో పోలీసులు కూడా ఇదే బాట ఎంచుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి.. చూద్దాం. 


 


Comments

Popular posts from this blog

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?