Skip to main content

వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక ప్రపంచ నాయకుడు


అనుసరించేవాడు ఫాలోయర్. నడిపించేవాడు లీడర్. ప్రపంచాన్నంతా అమెరికా శాసిస్తుంటే.. అమెరికాను ఇండియా శాసించకపోయినా ఫాలో అయ్యేలా మాత్రం చూసుకుంటోంది. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకొని, ఎక్కడేం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అమెరికా... పూర్తిగా ఇండియా మీద ఆధారపడిందనేందుకు ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. ఇటీవల కరోనా విజృంభించి మానవాళికి ముప్పుగా పరిణమించిన క్రమంలో ధనిక దేశాలు చాలావరకు ఇండియా వైపే చూశాయి. ఇండియా మీదనే ఆశలు పెట్టుకున్నాయి. అమెరికా కూడా ఆ జాబితాలోనే ఉండడం అందరం చూసిందే. అమెరికా ఏ స్థాయిలో ఇండియా మీద పూర్తి భరోసాగా ఉందనేందుకు ఇంతకన్నా చెప్పుకోదగ్గ నిదర్శనం అవసరం లేదు.అమెరికా పాలసీకి, పరిపాలనకు అద్దం పట్టే వైట్ హౌస్.. ఇండియాను ప్రముఖంగా ఫాలో అవుతోంది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. 


Also Read: చంద్రుడి మీద మైనింగ్ కి ట్రంప్ గ్రీన్ సిగ్నల్


అధికారిక ట్విట్టర్ అకౌంట్.. ద వైట్ హౌస్ కు 2 కోట్ల 16 లక్షల పైచిలుకు ఫాలోయర్స్ ఉండగా.. అది మాత్రం కేవలం 19 మందిని మాత్రమే ఫాలో అవుతోంది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఐదున్నర కోట్లకు పైగా ఫాలోయర్స్ ఉండగా.. 2,300 కు పైగా అకౌంట్ హోల్డర్స్ ను ఆయన ఫాలో అవుతున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే... వైట్ హౌస్ నరేంద్ర మోడీని మినహా ఏ ఒక్క ప్రపంచ లీడర్ ను కూడా ఫాలో అవడం లేదు. రెండో అగ్రరాజ్యమైన చైనాధీశుడు జిన్ పింగ్ గానీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ గానీ, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్... ఇలా ఏ ఒక్క అగ్రరాజ్యానికి చెందిన అధినేతను సైతం వైట్ హౌస్ ఫాలో అవడం లేదు. ఆ 19 మంది ఫాలోయర్స్ లో కూడా 5 అకౌంట్లు ఇండియాకు చెందినవే కావడం విశేషం. 1) నరేంద్రమోడీ పర్సనల్ అకౌంట్, 2) పీఎంఓ ఇండియా, 3) ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 4) యూఎస్ ఎంబసీ ఇండియా, 5) ఇండియా ఇన్ యు.ఎస్.ఏ.   ఇక మిగిలిన అకౌంట్లు అన్నీ కూడా అమెరికాకు చెందినవే కావడం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అంశం. ఇప్పుడు ఆలోచించండి... ప్రపంచం ఎవరిని గుర్తిస్తుందీ.. ఎవరినీ ఫాలో అవుతుందో.


Ref: PM Narendra Modi only world leader White House follows on Twitter


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.