Skip to main content

"కరోనాతో సహజీవనమే పరిష్కారం"


శత్రువును తుదముట్టించడం సాధ్యం కానప్పుడు లేదా శత్రువు మనకన్నా బలవంతుడైనప్పుడు రాజీ మార్గమే పరిష్కారమనేది మన ప్రాచీన రాజనీతి. అదే సూత్రం యుద్ధనీతికీ వర్తిస్తుంది. రెండువర్గాలు ఎదురుబొదురు కూర్చొని ఏదోకటి సెటిల్ చేసుకునే సందర్భంలో ఎవరో ఒకరు తగ్గడం, ఇంకొకరు మొగ్గడం సాధారణమే. అయితే యుద్ధం మొదలై శత్రువు విరుచుకుపడుతున్నప్పుడు ఆ శత్రువును కూడా చికాకు పరచకుండా కొంత సానుకూల వాతావరణం, కొంత అనుకూలమైన ప్రదేశం కల్పించి తనకు ఇబ్బంది రాకుండా చూస్తే శత్రువు దృష్టి మళ్లించినవాళ్లమవుతాం. తన రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది రాకుండా చూస్తే మన కార్యకలాపాలు మనం చేసుకోవచ్చు. అంటే ఒకరిని ఒకరు ఇబ్బందిపెట్టకుండా ఉండడం లేదా ఒకరికొకరు భయంతో కూడిన గౌరవ, మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట. 


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదే సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలని సంకల్పించారు. రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చూచాయగా చెప్పారు. తాము కోవిడ్-19 ని ఎదుర్కోవాలని నిశ్చయించామని, అందుకు తగిన ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. తాజాగా మీడియా ముందుకొచ్చి ప్రకటించారు కేజ్రీవాల్. కరోనాను పూర్తిగా తుడిచేయడం ఇప్పట్లో సాధ్యం కాదని, అప్పటిదాకా మనం ఇళ్లకే పరిమితమైతే జరగబోయే నష్టాన్ని ఊహించలేమన్నారు. అందుకని మధ్యేమార్గంగా.. కరోనాతో కలిసి జీవించడాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పడం విశేషం. అంటే సామాజిక దూరాన్ని పాటించడం, శానిటైజర్స్ వినియోగించడం, పని ప్రదేశాల్లో కేంద్రం నిర్దేశించిన నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించడం..  ఇలాంటివన్నమాట. అంతేకాదు.. కరోనా విజృంభణ నానాటికీ పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ ను మరో రెండువారాలు పొడిగించడం విశేషం. అటు కేసులు పెరగడంతో కంటైన్మెంట్ జోన్లు పెరిగాయి. వాటి పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే నిబంధనలు పాటిస్తూనే.. ప్రొడక్షన్ ను మొదలు పెట్టడానికి ఉన్న అనువైన మార్గాల అన్వేషణలో పడ్డారన్నమాట. 


ప్రజల్ని ఎక్కువకాలం ఒకేచోట నిలిపి ఉంచడం సాధ్యం  కాదంటున్న కేజ్రీవాల్.. జోన్లవారీ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. వ్యవసాయాన్ని, ప్రైవేటు పరిశ్రమలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 33 శాతం వర్క్ ఫోర్స్ తో ప్రైవేటు కంపెనీలు పని చేయడానికి అనుమతిస్తామన్నారు. అలాగే వ్యవసాయరంగానికీ మినహాయింపులు ఇస్తామన్నారు. ప్రజారవాణాను కూడా షరతులకు  లోబడి అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. ఫోర్ వీలర్స్ లో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే, టూ వీలర్ మీద ఒక్కరు మాత్రమే ప్రయాణించే నిబంధనలు కఠినంగా అమలు చేస్తామన్నారు. 


మొత్తానికి కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నా కూడా ప్రజాజీవనానికి బ్రేకులు పడకుండా ఉండే మార్గాల్ని కేజ్రీవాల్ అమలు చేయబోతున్నారు. ఎందుకంటే ఢిల్లీలాంటి కాస్మొపాలిటన్ సిటీల్లో జనమంతా ఇళ్లకే పరిమితమైతే ప్రభుత్వ పాలన స్తంభించిపోవడం ఖాయం. రూ. 3200 కోట్ల నష్టం వాటిల్లిందంటూ కేజ్రీవాల్ ఓ ఉదాహరణగా చెప్పడాన్ని అర్థం చేసుకోవాలి. 


అటు మహారాష్ట్రలో పలు ప్రైవేటు కంపెనీలు చాలా జాగ్రత్తలు పాటిస్తూ పరిశ్రమలు తెరుస్తున్నాయి. ఇదే బాటలో మిగతా రాష్ట్రాలు కూడా కొనసాగే అవకాశాలు త్వరలోనే రావచ్చు. అయితే దీనికి బలమైన ప్రజా సంకల్పం ఉంటే తప్ప విజయవంతం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ప్రభుత్వాలు కూడా నిబంధనల అమలులో స్ట్రిక్టుగా ఉంటూనే ఉత్పత్తి వ్యూహాలు ప్రారంభించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 




 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.