Skip to main content

మతోన్మాదం పేదవారికి ప్రథమ శత్రువు


 


ఆధ్యాత్మికత వేరు, మతం వేరు. ఆధ్యాత్మికతలో మనిషి తనను తాను పరిశీలించుకుని ఆత్మ దర్శనం కొరకు సాధన చేసి పరమాత్మను గురించి పరమాత్మ సంకల్పానుసారం సాధనలో ముందుకు వెళ్తాడు. ఆత్మ జ్ఞానానికి ఏ మతంతో, కులంతో సంబంధం లేదు. ఋషులు, మునులు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, శిరిడి సాయిబాబా, బ్రహ్మంగారు ఈ కోవలోకి చెందినవారు.


వాస్తవం చెప్పాలంటే మన దేశంలో హిందూ మతం, హిందూ జాతి అనే పదాలను అర్థం తెలియకుండా వాడుతున్నారు. వేదాలలో భగవద్గీతలో హిందూ మతం అనే పదం లేదు. భరతజాతి అని కొన్ని చోట్ల ఉంది. మన దేశంలో కొందరు విష్ణు భక్తులు, వైష్ణవులు, కొందరు శివ భక్తులు, శైవులు కొందరు అద్వైతాన్ని మరికొందరు ద్వైతాన్ని విశిష్టాద్వైతాన్ని అనుసరిస్తారు. యజ్ఞాలలో జంతుబలిని హింసను వ్యతిరేకించి కరుణారస హృదయంతో బౌద్ధం వచ్చింది. శంకరుని మాయ వాదమైనా బౌద్ధంలోని నిరంతరం మారే ప్రపంచమన్న వాస్తవంగా ఒకే విషయాన్ని చెప్తున్నది.
 


యోగులు అందరూ అద్భుతమైన అనుభవాలు కలవారే. ఇహలోక సుఖాలను కాదని పరమాత్మ సన్నిధానానికై ప్రయత్నించినవారు అన్ని మతాల్లో ఉన్నారు. జైనులు, సిక్కులు, ఆర్య సమాజం వారు ఇలా ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి. వాస్తవంగా ఒక మతం, ఒక జాతి అంటే ఒకే దేవుడు ఒకే మతపరమైన ఆచరణ పూజలు ఒకే భాష ఒకే సంస్కృతి కలిగి ఉంటాయి. మన భారతదేశంలో విభిన్న మతాలు, కులాలు దేవుళ్ళు మతాచారాలు, భిన్న భాషలు భిన్న సంస్కృతులు ఉన్నాయి. వీటితో పాటు మనుధర్మ శాస్త్రం ప్రజలను చీల్చింది. వేదాలు చదివే హక్కు ఒక కులం వారికే పరిమితం చేసింది. శూద్రులకు స్త్రీలకు విద్యను ఆస్తిని నిరాకరించింది. శూద్రులను, స్త్రీలను అణచి ఉంచాలని వారు అగ్రవర్ణాలవారితో పోటీ పడకూడదని షరతు విధించారు. మను ధర్మం అక్రమమని అన్యాయమని ఆర్.ఎస్.ఎస్ చెబుతుందా? హిందువులు ఎవరిమీద  దాడి చేయలేదని ఒక వాదన. చరిత్రలో ఎంత మంది హిందూ రాజులు తమలో తాము యుద్ధాలు చేయలేదు? మహాభారత యుద్ధం మొదలు కళింగ యుద్ధం, బొబ్బిలి యుద్ధం చేసింది హిందూ రాజులు కాదా? శైవుల మీద వైష్ణవులు వైష్ణవుల మీద శైవులు, వైష్ణవులు బౌద్ధుల మీద దాడి చేయలేదా? ఎందరో బౌద్ధ బిక్షలను చంపలేదా? యుద్ధాల పేరుతో యాగాల పేరుతో ఆవులను, గుర్రాలను, మేకలను, కోళ్లను బలి ఇవ్వలేదా? రక్తం ఏరులై ప్రవహించలేదా? జీవహింస వద్దని చెప్పింది మొదట బుద్ధుడు తర్వాత బ్రహ్మంగారు.


ముస్లింలు ఆంగ్లేయులు దండెత్తి వచ్చినప్పుడు ఏ మంత్రాలు తంత్రాలు జాతకాలు పని చేయలేదు కదా? మంత్రాలతో కరోనాను నివారించగలవా? బ్రిటిష్ వారు ముస్లింలు ఇతర దేశాల నుంచి వచ్చారని వాదించేవారు, ఆర్యులు అంటే బ్రాహ్మణులు, క్షత్రీయులు ఎక్కడి వారో ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకుంటారా? మధ్య ఆసియా, ఇరాన్, ఇరాక్ ప్రాంతాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వచ్చి దేశాన్ని ఆక్రమించుకోలేదా? ఇక్కడి ప్రజలను బానిసలుగా చేసి మనుధర్మం పేర అణచి ఉంచలేదా? నేడు కావలసింది హిందూ మతం,హిందూ జాతి కాదు. భారత జాతి, భారతీయత, ఆకలిగొన్న కార్మికులకు, వలస కార్మికులకు పట్టెడు అన్నం తినడానికి తిండి, గుడ్డ, ఆశ్రయం. కానీ దయ, కరణ, హిందూ దురభిమానం, ప్రేమ ఎవరి మీద అంబానీల మీద, అదానిల మీద అటువంటి వారి లక్షల కోట్ల అప్పులు మాఫీ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు మాఫీ, అంతరిక్ష ప్రయోగశాలతో సహా దేశ రక్షణ, పరిశ్రమలు, రైల్వేలు, బి.ఎస్.ఎన్.ఎల్ అన్ని అత్యంత ముఖ్యమైన పరిశ్రమలను, కార్పొరేట్ కంపెనీలకు అప్పగింత. విద్యను వైద్యాన్ని మరింత ప్రైవేటీకరణ రవాణా ప్రైవేటీకరణ ఎవరికోసం ఎవరికి లాభం చేకూర్చడానికి?


భారతదేశం అంటే ఇక్కడి రైతులు, ఇక్కడి కుల వృత్తుల వారు,చేతివృత్తుల వారు, కూలీలు,వలస కూలీలు,చిన్న ఉద్యోగస్తులు మధ్యతరగతి వారు,సామాన్య ప్రజలు. కూలీ చేసే కార్మికుడు హిందువైన, ముస్లిమ్ అయినా,దళితుడైన ఏ కులం వాడైన ఆకలికి కులం లేదు, మతం లేదు, మానవత్వం, మంచితనం, ప్రేమ, జాలి, కరణ, దయ ఇవి కావాలి. సమానత్వం సమాన అవకాశాలు ఆస్తుల, పరిశ్రమల జాతీయకరణ, భూముల జాతీయకరణ, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులకు గిట్టుబాటు ధర, నిత్య జీవిత అవసర వస్తువుల పంపిణీ ఇవి చేయాల్సింది. అదానీల,అంబానీల సేవ కాదు. విదేశీ మల్టీ నేషనల్ కంపెనీలకు లాభాలు తెచ్చి పెట్టడం కాదు. హిందూ జాతి, హిందూ మతం పేరు మీద మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మహాత్మా గాంధి లాంటి గొప్ప వ్యక్తిని మత పిచ్చితో హత్య చేసిన వారిని బల పరచే మనస్తత్వం మంచిది కాదు. సర్వమత సామరస్యం, ప్రజల ఐక్యత, కుల, మత బేధాలను పోగొట్టడం విద్వేషాలను తగ్గించడం ప్రతి దేశభక్తుని కర్తవ్యం.


- జస్టిస్ బి. చంద్రకుమార్


 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.