Skip to main content

మీ ఇంటి ముందుకే లిక్కర్ బాటిల్


నువ్వు నా దగ్గరకు వస్తే సమస్య గానీ.. నేనే నీ దగ్గరకు వస్తే సమస్యే ఉండదు కదా అంటోంది లిక్కర్ బాటిల్. మూడో దఫా లాక్ డౌన్ పొడిగింపు సందర్భంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో వైన్ షాపులు తెరుచుకున్నాయి. వైన్ షాపులు తెరుచుకోవడంతో మందుబాబుల భారీ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్  డిస్టెన్స్ పాటించడం అనేది ఓ పెద్ద సవాలుగా మారింది. మందు  చుక్క కోసం గంటల తరబడి క్యూలైన్లలో వెయిట్ చేయడం, మందుకోసం ఒకరినొకరు తోసుకోవడం, అటు ప్రభుత్వాల దగ్గర కూడా డిమాండ్ కు తగ్గట్టుగా ఎలా నిర్వహంచాలో ప్లానింగ్ లేకపోవడంతో.. ఈ రంగంలోకి ఫుడ్ డెలివరీ సంస్థలు అడుగు పెడుతున్నాయి. ప్రభుత్వాలు చేయలేని పని మేం చేస్తామంటూ కొత్త వ్యాపార సూత్రాలతో ముందుకొస్తున్నాయి. 



వినియోగదారులకు హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి టిఫిన్, మీల్స్ డెలివరీ చేసే జొమాటో ఇకనుంచి లిక్కర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. లాక్ డౌన్ కు ముుందు ఫుడ్ ఆర్డర్లతో ఫుల్ బిజీగా ఉండే జొమాటో.. లాక్ డౌన్ తరువాత దాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో డెలివరీ బాయ్స్ కు ఉపాధి లేకుండాపోయింది. చాలా వ్యాపార సంస్థల్లాగే జొమాటో కూడా నష్టాల్లోకి వెళ్లిపోయింది. అయితే ప్రతి చీకటి వెనుక ఓ వెలుగురేఖ ఉంటుంది కదా. అలా వైన్  షాపుల ముందు మందుబాబుల  భారీ  క్యూలను అవకాశంగా భావించిన జొమాటో... తన సేవలను లిక్కర్ డెలివరీ వైపు మళ్లిస్తూ నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర టిఫిన్ సెంటర్లకు ఇప్పట్లో ఆదరణ ఉండే అవకాశం లేదు. అవి కొత్తమార్గాన్ని వెదుక్కోవడానికి చాలా టైమ్ పడుతుంది. ఆ ఇండస్ట్రీ అంతా సంక్షోభంలోకి కూరుకుపోయింంది. అయితే వాటిమీదనే ఆధారపడ్డ జొమాటో కూడా అలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్న తరుణంలో లిక్కర్ డెలివరీ ఐడియాతో మళ్లీ నిలదొక్కుకునేందుకు ప్లాన్ చేయడం  విశేషం. అలాగే జొమాటోకు పోటీగా ఇదే ఫుడ్ డెలివరీలో పనిచేస్తున్న స్విగ్గీ  కూడా లిక్కర్ డెలివరీలోకి వెళ్లిపోతోంది. ఇప్పటికే ఈ సంస్థలు ఢిల్లీ వంటి  పెద్ద నగరాల్లో  ఆపరేషన్లు చేపట్టాయి. ఇక రేపోమాపో హైదరాబాద్ లో కూడా లిక్కర్ డోర్ డెలివరీ అవుతుందన్నమాట. 


 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.