Skip to main content

చిత్రమాలిక-వాడవాడలా వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆరాధనోత్సవాలు


రాజయోగి, అద్వైతబ్రహ్మ శ్రీవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి 327వ ఆరాధనోత్సవాలు తెలుగు నేలపై శ్రద్ధాభక్తులతో జరుపుకున్నారు. స్వామివారు జీవసమాధి అయిన రోజునే ఆరాధనా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగునాట వస్తున్న సంప్రదాయం. బ్రహ్మంగారు తెలుగు, కన్నడ మూలాలకు చెందిన తత్త్వవేత్త కావడం వల్ల దక్షిణభారత దేశంలో ఆయన బోధనలకు  ప్రాశస్త్యం లభించింది. తత్వవేత్తగానే గాక యోగిపుంగవుడిగా, సామాజిక న్యాయమూర్తిగా, మహిమలు చూపిన మహిమాన్వితుడిగా, కోరిన కోర్కెలు తీర్చిన దేవదేవుడిగా, కాలజ్ఞాన ప్రదాతగా, ప్రళయానంతర కాలమున వెలుగులు ప్రసరింపజేయడానికి వచ్చే పరంజ్యోతిగా.. ఇలా అనేక విధాలుగా బ్రహ్మంగారు తెలుగువారి ఇంటిల్లిపాదికీ ఇష్టదైవం. 



ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పీడిస్తున్న సమయంలో స్వామివారి ఆరాధనోత్సవాలను సామాజికదూరం పాటిస్తూ తెలుగువారు శ్రద్ధాభక్తులతో జరుపుకున్నారు. హైదరాబాద్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని "శ్రీ విరాట్ విశ్వకర్మ పరిరక్షణ సమితి" రాష్ట్ర కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు "బ్రహ్మశ్రీ వేములవాడ మదన్ మోహన్" స్వామివారి చిత్రపటానికి పూలమాలలు వేసి గురుపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత మదన్ మోహన్ మాట్లాడుతూ... 17 వ శతాబ్దానికి చెందిన దైవ స్వరూపుడు బ్రహ్మంగారు అని, విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పోతులూరి పరిపూర్ణాచార్యులు,ప్రకృతాంబ అనే పుణ్య దంపతులకు జన్మించారన్నారు. గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో పశువుల కాపరిగా చేరి ఆమె పుత్రుడికి చూపు దానం చేశారని, తాటాకులపై కాలజ్ఞానం రాశారని, అందులో రాసినవే నేటికీ జరుగుతున్నాయన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారు ఒక విశ్వబ్రాహ్మణులకే కాదు అన్ని కులాలకు, మతాలకు గురువు, దైవం అని కొనియాడారు. ముస్లిం అయిన సిద్ధప్పను శిష్యునిగా చేర్చుకున్నారన్నారు. 



గద్వాల



జనగాంలో



ఖానాపూర్ 



మలక్ పేటలో



కర్నాటకలోని చిక్కబళ్లాపూర్, మంజునాథాచార్య స్వగృహం



నార్కట్ పల్లి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో



నర్సంపేటలో



సికింద్రాబాద్, విశ్వకర్మ భవనంలో



హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై, బ్రహ్మంగారి విగ్రహం వద్ద



విశాఖలోని స్టీల్ ప్లాంట్ వద్ద



వరంగల్ లో స్వర్ణకార సేవాసమితి ఆధ్వర్యంలో



ఖమ్మం-సైదాచారి స్వగృహంలో యజ్ఞ నిర్వహణ



 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.