Skip to main content

జయశంకర్ ను స్మరించుకున్న నేతలు, విశ్వబ్రాహ్మలు


 

నువ్వు నాయకుడు అవుదామనుకున్న ప్రతిరోజూ నీకు పదిమంది వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉంటారు.

అదే నువ్వు పది మంది నాయకులను తయారు చేస్తే నీ లక్ష్యానికి వాళ్లంతా తోడుగా నిలిచి  నిన్ను నాయకుడిని చేస్తారు.


- కొత్తపల్లి జయశంకర్, ప్రొఫెసర్


------------------


యావత్ తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సమావేశాలు జరిగాయి. అయితే లాక్ డౌన్ కారణంగా పెద్దఎత్తున సభలు, సమావేశాలను ఎవరూ ఏర్పాటు చేయకపోయినా.. పలువురు టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఇతర యాక్టివిస్టులు, అటు విశ్వబ్రాహ్మణ సంఘాల నేతలు విడివిడిగా ఎవరి ఇళ్లలో వారే నివాళులు అర్పించి జయశంకర్ సార్ తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి విజయం సాధించి ప్రజలకు అప్పగించి అనంత లోకాలకేగిన జయశంకరుడు ఆశించిన ఫలాలు మాత్రం సమాజానికి అందడం లేదని, జయశంకరుడి జాతికే చెందిన విశ్వకర్మలు మరీ అణచివేతకు గురవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ జాతి స్వేచ్ఛ కోసం పోరాడిని జాతి ప్రజలే ఇవాళ ఆకలితో అలమటిస్తున్నారని పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. 





ఆచార్య జయశంకర్ సార్‌కు నివాళుర్పించిన రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... జ‌యశంకర్ సార్‌ తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా జీవించారన్నారు. యావజ్జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోసిన ఆయన ఆశయం స్ఫూర్తిదాయకమన్నారు. వారితో ఉన్న అనుబంధాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.


 


 కవితలు


అమరుడు జయశంకరుడు



 


అమరుడు జయశంకరుడు


నిరాడంబరుడు జయశంకరుడు


తెలంగాణ జాతిపిత జయశంకరుడు


నీళ్లు, నిధులు,నియామకాల కోసం కొట్లాడింది జయశంకరుడు,
తెలంగాణ దిక్సూచి జయశంకరుడు,
తెలంగాణ జాడ జయశంకరుడు,
నీ ఆశయాలు కొనసాగిస్తము.
జోహార్ జయశంకర్ సార్ జోహార్ జోహార్


----------------------


సలాం సారూ


అణచబడ్డ తెలంగాణ అభివృద్ధి
ప్రత్యేక తెలంగాణతోటే సాధ్యమని నమ్మిన సిద్ధాంతాన్ని .........


సిద్ధాంతం గా బోధించిన 
ఓ......
తెలంగాణ సిద్ధాంత కర్తా
అలుపెరుగని ఆశయంతో.......


అధికారం అంటే ఆశ కాదు
ఆశయ సాధన అంటూ.......


నిరంతర కృషి పట్టుదలే ఆయుధాలని భోదించి శోధించి......
 ఉద్యమనేతగా K C R గారిని ఎన్నుకున్న అభినవ ద్రోణాచార్యా........ 


నువ్వు కన్న కలలు
మాకు నిజం చేశావ్........


తెలంగాణ గడ్డ ఉన్నన్నాళ్లు
మరవదు ఏ బిడ్డ నిన్ను.......


 మీ యాదిలో తొమ్మిదేళ్లు గడిచిపోయాయి.......


అయినా...... 


తెలంగాణ జాతిపిత గా 
మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ 
గారని.....
 
మన తెలంగాణ సకల జనులు......


మీ గురుతులను గుండెల్లో పెట్టుకుంటారు.......
ఇది సత్యం 


ఓ అమరుడా ......


అందుకో
 మా అశ్రు నివాళులు .....


,ప్రగతి పథంలో పరుగెడుతూ
అభివృద్ధి ఆశయంగా ఎదుగుతున్న తెలంగాణను
దీవించండి ఆచార్యా ....


జయహో జయశంకరా
జయ జయహో జయశంకరా


మీ తొమ్మిదవ వర్థంతి సందర్బంగా అశ్రునయనాలతో.....
 
తెలంగాణ విశ్వకర్మ పరిరక్షణ సమితి తరపున మరియు నా తరపున అశ్రు నివాళులు అర్పిస్తూ..


- పసునూరోజు వాసుదేవాచారి, జై విశ్వకర్మ


-----------------


ఖమ్మంలో



వేదాస్, ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొ జయశంకర్ సార్ 9వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న విశ్వబ్రాహ్మణ ఉద్యోగులు, నాయకులు


---------------------


కుత్బుల్లాపూర్ లో



హైదరాబాద్, శ్రీ రావినారాయణ రెడ్డి నగర్ 2,  కుత్బుల్లాపూర్ నందు విశ్వకర్మ గాయిత్రి సంఘం, కొండువరపు శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో డాక్టర్ కె జయశంకర్ సర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతోజు వెంకటాచారి (విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సంఘాల) రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షత వహించగా బెల్లపు దుర్గారావు అధ్యక్షులు ( తెలంగాణ బీసీ ఫెడరేషన్  కులాల రాష్ట్ర సమితి) ముఖ్య అతిథిగా, అలాగే N. వీరన్న(తెలంగాణ ఎంబీసీ డీఎన్టీ నవ నిర్మాణ సమితి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రవిచారి, వడ్ల అరుణ,  సమంత, రఘుచారి తదితరులు పాల్గొన్నారు.


--------------------------


అభిప్రాయాలు


మిత్రులందరికీ నమస్కారం..
ఈ రోజు Prof. Kothapalli Jayashankar Sir వర్ధంతి.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహోరాత్రులు తపించి, తెలంగాణకు తరతరాలుగా జరిగిన అన్యాయాన్ని, అవమానాలను, వివక్షతను తను పుట్టి బుద్దెరిగిన నాటినుండి, తొలి తెలంగాణా ఉద్యమ కాలంనుండి పోరాడుతూ, అవకాశవాదులు ఉద్యమాన్ని వదిలేసినా, అనేక దశాబ్దాలుగా ఒంటరిగా పోరాడుతూ, ఉద్యమం నిర్మిస్తూ, తెలంగాణ ఎన్ని తీర్ల వెనుకబడేయబడ్డదో అనే జ్ఞానాన్ని తన తోటివారికి, తన శిష్యగణానికి బోదిస్తూ, ఉద్యమ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, సభలు సమావేశాలు నిర్వహిస్తూ సంఘాలను ఏర్పాటు చేస్తూ, అనేక నిర్భంధాలను  ఎదుర్కొంటూ, అనారోగ్యం పాలవుతూ, మలి దశ ఉద్యమ చివరి అంకంలో ప్రత్యేక రాష్ట్రం సిద్దిస్తున్న తొలి ఉదయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో అనారోగ్యం పాలై జయశంకర్ సార్ ఇదే రోజు జూన్ 21న అస్తమించాడు.



ప్రతి అస్తమయం ఒక తొలి ఉదయాన్ని అందిస్తుంది. ఇది ప్రకృతి ధర్మం.
జయశంకర్ సార్ తెలంగాణబిడ్డగా తెలంగాణ జాతిని మేల్కొలిపి  తెలంగాణ కోసం తన ప్రాణాలను ఫలంగా పెట్టి త్యాగజీవి అయినాడు. తెలంగాణ జాతిపితగా మారినాడు. 


సార్ వర్ధంతి సందర్భంగా
VEDAS Association TS శ్రధ్ధాజలి 🙏ఘటిస్తున్నది.
 రాష్ట్ర కమిటీ,
VEDAS Association, TS.


--------------------
 


జై విశ్వకర్మ, జై వేదాస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు అహరహం శ్రమించి,తొలి, మలి దశ ఉద్యమాలకు ఆద్యుడిగా నిలిచి,ఎంతో మంది నాయకులకు స్ఫూర్తిగా ఉండి,ప్రత్యేక రాష్ట్రం కల సాకారం కావడానికి ముఖ్య కారకు లై, విశ్వకర్మ జాతికే వన్నె తీసుకు వచ్చిన ప్రొ: జయశంకర్ సార్ గారి వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాము.మనమందరము వారి అడుగుజాడల్లో నడిచి మన విశ్వకర్మ జాతికి,హైందవ సంస్కృతికి, దేశానికి వన్నె తీసుకురావాలని కోరుకుంటూ వారికి వేదాస్, సంగారెడ్డి జిల్లా పక్షాన నివాళులు అర్పిస్తున్నాము. 


 -----------------------


ప్రొఫెసర్ కొత్త పల్లి జయశంకర్ సార్ నేడు  వర్ధంతి సందర్భంగా వారికి ఇవే జోహార్ జోహార్ కొత్తపల్లి జయశంకర్ సార్ కు జోహార్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అంటే అది మీ వల్లనే మీ కృషి పట్టుదల మీ ఆరాటం మీ పోరాటం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ మీరు చూడలేక పోయారు అది మా దురదృష్టం ఏదేమైనా మీరు కోరుకున్న తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ ఈ రోజు మీకు ఘనంగా నివాళులు అర్పించాలని కోరుకుంటూ మరొకసారి మీకు మా జోహార్లు తెలియజేసుకుంటూ


- గ్రేటర్ హైదరాబాద్ విశ్వబ్రాహ్మణ మను మయ సంఘం అధ్యక్షులు, రాళ్ళబండి విష్ణు ప్రధాన కార్యదర్శి, ఫులోజు అశోక్ చారి ఉపాధ్యక్షులు, కొలనూరు శ్రీనివాస్, కోశాధికారి బదనకంటి సైదాచారి మరియు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ


 



Comments

Popular posts from this blog

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?