Skip to main content

విశ్వబ్రాహ్మల ఆకలి కేకలు వినండి


పనికి ముందుండి తిండికి వెనకుండే విశ్వబ్రాహ్మలను ఆదుకోవాలని, ఈ సమాజ నిర్మాణంలో వారి పాత్రను గుర్తించి కష్టకాలంలో ఆదుకోవాలని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు, ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ - విశ్వకర్మ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చేపూరి లక్ష్మణాచారి ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. కరోనా విజృంభించి, లాక్ డౌన్ విధించిన తరువాత అందరికంటే ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులే జీవనోపాధి కోల్పోయారని, పనులు చేయించుకునేవారు లేక జీవనోపాధి కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాయి ఇళ్లు, ఇరుకైన ఇళ్లలో పిల్లాపాపలతో జీవించడం ఎంతో కష్టంగా ఉందని, తెలంగాణ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇకనైనా పూర్తి చేసి పేదలకు కనీస వసతులు సమకూర్చాలని లక్ష్మణాచారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సిద్ధించి ఆరేళ్లు పూర్తయినా విశ్వబ్రాహ్మలకు ఎలాంటి ప్రభుత్వ పథకాలూ అందలేదన్నారు. ఎన్నికలకు ముందు రుణాలు ఇస్తామన్న కేసీఆర్ ఎన్నికలు పూర్తయ్యాక కనీసం తాము పెట్టుకున్న అప్లికేషన్ల స్టేటస్ ఏంటో కూడా తెలిపే పరిస్థితి లేదన్నారు. కనీసం తమకు లోన్లు ఇచ్చినా ఏదో రకంగా ఈ కరోనా కష్టకాలాన్ని అధిగమించేవారమన్నారు. తమకు లోన్లు ఇవ్వక, ప్రభుత్వ సాయం అందక ఏ ఉపాధీ లేని పేదలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, కంసాలి పని చేసుకొని పొట్ట పోసుకునే విశ్వబ్రాహ్మలకు పూట గడవడం లేదని, తమ ఐదు వృత్తులు కూడా దారుణంగా దెబ్బ తిన్నాయన్నారు. 



అందుకే కరోనా పీరియడ్ లో అత్యవసరంగా తమ జాతివారికి ఒక్కో కుటుంబానికి నెలకు కనీసం రూ. 10 వేల చొప్పున కనీసం 6 నెలలపాటైనా అందించాలని కోరారు. అలాగే 55 సంవత్సరాలు నిండినవారికి రూ. 2 వేల పింఛను ఇవ్వాలని, ఓల్డ్ సిటీలోని ఉప్పుగూడలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఉప్పుగూడ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని, త్వరలోనే తమ పోరాట కార్యక్రమాన్ని ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణాచారితో పాటు ఉప్పుగూడ సంఘం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్ష్యుడు సజ్జనపు షణ్ముఖాచారి, ప్రధానకార్యదర్శి తోట శ్రీనివాసాచారి, కోశాధికారి లక్కుంట్ల శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షులు కూరెళ్ల బాలకృష్ణాచారి, దాసోజు కనకాచారి, పోలోజు దక్షిణామూర్తి, మేడిపల్లి వెంకటేశాచారి, జేఎస్ లు దాసోజు లక్ష్మణాచారి, వలబోజు రవి కిరణ్ ఆచారి, గౌరవాధ్యక్షులు కేశోజు వెంకటాచారి, జెలపల్లి లక్ష్మీ నారాయణాచారి, సభ్యులు చాట్లపల్లి ప్రభాకరాచారి, బోనాల మధుసూదనాచారి, కొక్కొండ కిరణ్ కుమార్ ఆచారి, ఆకోజు జ్ఞానేశ్వరాచారి, ఓరువాళ్ళ వీరేశాచారి, తిప్పర్తి రాజు ఆచారి తదితరులు పాల్గొన్నారు. 



Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.