Skip to main content

ప్రజల కోసం పని చేసేవారికి ఏ కార్పొరేట్ శక్తుల అండా అవసరం లేదు

ప్రజలకు సేవ చేయడానికి, సామాజిక అభ్యున్నతి కోసం పాటు పడడానికి, అందుకోసం రాజకీయ పార్టీలు నడపటానికి కార్పొరేట్ శక్తుల మద్దతు అవసరం లేదని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. 1977లో జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, యూపీలో కాన్షీరామ్ స్థాపించిన బీఎస్పీ పవర్ లోకి రావడానికి, 1984లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ అధికారంలోకి రావడానికి ఏ కార్పొరేట్ శక్తి కూడా పని చేయలేదని, తొలినాళ్లలో ఎన్టీఆర్ కు ఆయన సొంత కులం వాళ్లే సహకరించలేదని చంద్రకుమార్ అన్నారు. మొక్కవోని దీక్ష, చిత్తశుద్ధి మాత్రమే ఏ నాయకుణ్నయినా, ఏ పార్టీనైనా ముందుకు నడిపిస్తాయన్నారు. ప్రజల కోసం చేసే నిస్వార్థపూరితమైన మంచిపని ఏదైనా ఎంతో ఆత్మతృప్తిని కలిగిస్తుందని, ఎంతో ఆనందాన్నిస్తుందని, అదే అన్నిటికన్నా విలువైందన్నారు. భావి సమాజాన్ని కాంక్షిస్తూ తాను రాసిన "మంచి మార్పు కోసం" అనే పుస్తకంతో పాటు సీడీని హైదారాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పలు సందర్భాల్లో చేసిన చిన్నపాటి తప్పిదాలు చరిత్రలో సరిదిద్దుకోలేని ఘోరాలుగా మారతాయని, 1948 నాటి కమ్యూనిస్టుల తప్పిదాన్ని ఆయన గుర్తు చేశారు. ఆనాడు కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని పక్కన పెట్టి ఉంటే 4 వేల మంది తెలివైన, అంకితభావం గల వీరుల ప్రాణాలు నిలిచి ఉండేవని ఆవేదన చెందారు. అందుకే నాయకుల అడుగులు తప్పటడుగులు కారాదన్నారు. అలాంటివి జరగకుండా అవసరానికి తగినట్టు వ్యవహరించే నాయకుడు ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొంటాడని, తెలంగాణ ప్రజలపార్టీలో పనిచేసే కార్యకర్తలు, నాయకులు కూడా అలాంటి ముందుచూపుతోనే వ్యవహరించాలన్నారు.



తనకు 17 ఏళ్ల వయసులో 1971లోనే సోషలిస్ట్ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా ప్రజా ఉద్యమాల్లోకి వచ్చానని.. ప్రేమ, దయాగుణాలు తన తల్లి నుంచి తనకు అబ్బితే, సమాజం కోసం త్యాగం చేసే లక్షణం తండ్రి నుంచి అలవడిందని అమ్మా-నాన్నల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ గుప్తా, వర్కింగ్ ప్రెసిడెంట్ లయన్ శ్యాంసుందర్, ఉపాధ్యక్షుడు-అధికార ప్రతినిధి రాజగోపాల్ నాయుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి, భారత్ టుడే టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.