Skip to main content

హైదరాబాద్ రెండో రాజధాని.. ఆంధ్రప్రభ కన్ఫర్మేషన్

మన దేశానికి ఇప్పటికైతే ఒకటే రాజధాని ఉంది. అది ఢిల్లీ. రెండో రాజధాని కూడా ఉందని, అది హైదరాబాదేనని ప్రముఖ దినపత్రిక ఆంధ్రప్రభ కన్ఫామ్ చేస్తోంది. గురువారం (29-10-2020) హైదరాబాద్ మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీ లోనే హైదరాబాద్ రెండో రాజధాని అంటూ కన్ఫామ్ చేసేసింది ఆ పేపర్ ఎడిటోరియల్ టీమ్. బుల్లెట్ ట్రెయిన్ ద్వారా "నాలుగు గంటల్లో ముంబైకి" అనే వార్తను హైలైట్ చేస్తూ దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి దేశ రెండో రాజధాని హైదరాబాద్ కు అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చని, దీనిద్వారా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు మరింత ఊపందుకుంటాయని ఓ మంచివార్తను ప్రజెంట్ చేశారు. కానీ.. దేశ రాజధానిగా హైదరాబాద్ ఎప్పుడైంది అనేదే అంతుపట్టడం లేదు.



కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఎప్పుడు ప్రకటించింది? రాష్ట్రపతి ఏమైనా రాత్రికిరాత్రే ఉత్తర్వులిచ్చారా? లేదా పార్లమెంట్ తలుపులు మూసి రహస్యంగా ఏమైనా పని కానిచ్చేశారా? ఎందుకంటే అప్పట్లో తెలంగాణను పార్లమెంట్ తలుపులు మూసి బిల్లు పాస్ చేశారు కదా.. అదే పద్ధతిలో ఇప్పుడు బీజేపీ నేతలు అవే ఎత్తుగడలేమైనా వేశారా? సామాన్య పాఠకుడికి ఇలా పరిపరివిధాలా ఆలోచనలు రావడం సహజం. కానీ కాస్త లోతుగా, సావధానంగా ఆలోచిస్తే లోగుట్టు ఏంటో అంచనా వేయొచ్చు.


ఆ పత్రిక 'ఆంధ్ర'ప్రభ అనేది మొదటి విషయం. తెలంగాణ ఏర్పాటును 'ఆంధ్ర' నాయకులు, కొన్ని వర్గాల ప్రజలు, ఆఖరుకు పాత్రికేయులు కూడా రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని తెలిసినా కూడా తెలంగాణను అడ్డుకోవడానికి అనేక విఫల ప్రయత్నాలు చేశారు. రాతలు, కూతలు, ప్రజెంటేషన్లు అదే పద్ధతిలో జరిగాయి. అందులో కొందరికి ఇప్పటికీ హైదరాబాద్ అన్నా, తెలంగాణ అన్నా జీర్ణం కాలేకపోతున్న ఘనపదార్థమే. ఈ తరహా వ్యవహార శైలి చాలాసార్లు వారిలో కనిపించింది. ఇటీవల వరదల సమయంలో కూడా వారి ప్రజెంటేషన్లు అదే పద్ధతిలో జరగడం గమనించాలి. మొన్నటి భారీ వర్షం హైదరాబాద్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన మాట వాస్తవం. అదే సమయంలో ఏపీలో కూడా భారీగానే వర్షాలు పడ్డాయి. అక్కడా ముంపు భారీగానే జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే కూడా చేయాల్సి వచ్చింది. కానీ ఆంధ్రా వరదలకు లేని ప్రాధాన్యం హైదరాబాద్ కే ఇచ్చారు. అవకాశం దొరికింది కదాని తెలంగాణ సర్కారును ఏకిపారేశారు. అయితే ఏకిపారేయడంలో తప్పేమీ లేదు కానీ.. మోతాదుకు మించి అధిక ప్రాధాన్యతనివ్వడం అనేది వార్తారచనలో, ప్రజెంటేషన్లో నిజాయితీ కన్నా ఓ రకమైన ఓర్వలేనితనమే కనిపించింది. సరిగ్గా అలాంటి ఓర్వలేనితనమేదో దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ను చూడాలని తహతహలాడుతోందన్నమాట. అంతకన్నా వేరే కారణం ఏమీ కనిపించడం లేదు.


అయితే రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేయాలన్న ప్రతిపాదనలు కేంద్రం దగ్గర ఉన్నాయని చాలా కాలంగా వార్తలొస్తున్నమాట వాస్తవం. ఆ వార్తలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆ మధ్య ఖండించడాన్ని గుర్తుంచుకోవాలి. అయితే భవిష్యత్తులో రెండో రాజధాని అనే ఆ కాస్త ముచ్చట కూడా తీరినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఇప్పుడు అన్నిరంగాలనూ ఓవరాలింగ్ చేస్తోంది. ఆ ఓవరాలింగ్ లో హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేసిపారేయొచ్చు కూడా. కానీ రెండో రాజధాని కాకముందే అయ్యిందన్న ముచ్చట తీర్చుకోవడం ఎందుకు? హైదరాబాద్ మీద అక్కసు వెళ్లగక్కడం ఎందుకు? ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే భద్రంగా మనసులో ఉంచుకుంటే అందరికీ మంచిది కదా.


 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.