ప్రాచీన వేద విజ్ఞానాన్ని, మన మహర్షులు అందించిన అద్భుతమైన సాహితీ వారసత్వాన్ని ప్రజలందరికీ అందించేందుకు బాణాల మల్లికార్జునరావు ఎన్నో ఏళ్లుగా పాటుపడుతున్నారు. ఇందుకోసం ఆయన సనాతన సాహితీ పరిషత్ అనే సంస్థను స్థాపించి సాహితీ సేవ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా మరో అయిదు మేలైన పుస్తకాలను ప్రచురించి పాఠకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు రచించిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి శతక సంపుటి, నూతలపాటి వెంకటరత్న శర్మ రచించిన సూర్యచరితము-పద్యకావ్యం, తెనాలి రామలింగ కవి రచించిన ధీరజన మనోవిరాజితముతో పాటు సంధ్యావందన్ చేసుకోవాలనేవారి కోసం లఘు సంధ్యావందనమ్, కర్మకాండ నిర్వహణలు వివరించే ఆబ్దికారాధనమ్ అనే గ్రంథాలను సనాతన సాహితీ పరిషత్ ద్వారా ప్రచురించారు.
ఈ ఐదు పుస్తకాలను ఆవిష్కరించి ట్యాంక్ బండ్ వద్ద గల శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం వద్ద ప్రదర్శించారు. ఈ సందర్భంగా పెదపాటి వీరబ్రహ్మేంద్రస్వామి ఈ సమాజానికి ప్రకృతికి, దేహానికి మధ్య ఉండే అనేక మార్మిక రహస్యాలను విప్పి చెప్పారని, ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు ఎవరూ అనర్హులు కారని, సాధన ద్వారా ఎవ్వరైనా అలౌకిక ఆనందాన్ని, యోగ విజ్ఞానంలోని పరమార్థాన్ని అనుభవించవచ్చన్నారు. దైవత్వానికి సామాజిక ప్రయోజనాలు తెలియజెప్పిన ఘనత వీరబ్రహ్మేంద్రస్వామిదేనని పెదపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, ఆధ్యాత్మిక-సాహితీవేత్త డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ డాక్టర్ గౌరీశంకర్, చామర్తి వాణీశ్వరశాస్త్రి, వానపాముల వీరనారాయణ శర్మ, ప్రముఖ కవి తంగెళ్లపల్లి కనకాచారి, బాణాల వాసుదేవాచారి, డి.నాగేశ్వరరావు, సునీల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: