Skip to main content

మాదిగ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‍లో ఒత్తిడి తేవాలి


మాదిగ రిజర్వేషన్ల అమలు కోసం అమరులైనవారికి తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఘనంగా నివాళులర్పించింది. వారి కుటుంబాలకు టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఇటుక రాజు ఉడతా భక్తిగా సాయం చేసి వారికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. సికింద్రాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీ-ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులు, అమరవీరుల బంధువులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రిజర్వేషన్ల సాధనకు వాతావరణం అనుకూలిస్తున్నదని, సుప్రీంకోర్టు ఈమధ్య రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్రాలే పూర్తి చేసుకోవచ్చని చెప్పడం శుభ పరిణామమని ఇటుక రాజు ఆనందం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం రచించి డ్రాప్టింగ్ కమిటికి ఇచ్చిన రోజున తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఐదో వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సుప్రీంకోర్టులో ఐదుగురితో కూడిన దర్మాసనం.. వర్గీకరణ ప్రక్రియను రాష్ట్రాలే పూర్తి చేసుకోవచ్చన్న సూచనను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. 29 రాష్ట్రాల్లో ఎస్సీల్లో 108 కులాలు ఉన్నాయని కొన్ని కులాలకు రిజర్వేషన్లు అందడం లేదని, వర్గీకరణ జరిగితే కింది కులాలకు కూడా ఫలాలు అందుతాయని రాజు ఆకాంక్షించారు. 

జనాభా నిష్పత్తి ప్రకారం కులాలకు రిజర్వేషన్ల పంపిణీ జరగాలని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సూచించారని, జనాభా ప్రతిపాదికన ఎబిసిడి వర్గీకరణ జరుగాలని కోరారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అసెంబ్లీలలో తీర్మానం చేసి పార్లమెంట్కు పంపడం జరిగిందని, అయితే అంతటితో ఆగకుండా ప్రధానమంత్రిని కలసి పార్లమెంట్ లోబిల్లు పెట్టేవరకూ పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో చట్టం చేసే వరకూ మాదిగలంతా ఏకతాటిపై ఉండి పోరాడాలని ఇటుక రాజు పిలుపునిచ్చారు. బిజెపి అధికారంలోతి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి చేయలేదని, సుప్రిం కోర్టు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించి పార్లమెంటే.. రాష్ట్రాలు చట్టాలు చేసుకునేలా చేస్తే సంతోషిస్తామన్నారు. ఏ ప్రభుత్వమైనా మాదిగ, మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాలపై దృష్టి పెట్టాలని కోరారు.  మాదిగలపై జరుగుతున్నా దాడులను అరికట్టే విధంగా చట్టాలు తేవాలని, దాడులు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 12 శాతం ఉన్న మాదిగలకు కేసిఆర్ మంత్రి పదవి ఇవ్వలేదని, మాదిగలు ఓట్లు వేయడానికే పనికి వస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 




Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.