అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేటర్ ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్న సస్పెన్స్ వీడేందుకు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఇవాళ ఓల్డ్ మలక్ పేట డివిజన్లో జరుగుతున్న రీపోలింగ్ దృష్ట్యా క్షేత్రస్థాయిలో సర్వే చేసిన పలు ప్రైవేటు సంస్థలు కూడా 1వ తేదీన ఎగ్జిట్ పోల్ అంచనాలు విడుదల చేయలేకపోయాయి. అయితే ఈ సాయంత్రం 6 గంటలకు ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాల విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్నికలపై సర్వే నిర్వహిస్తున్న ఆరా సంస్థ ఈ సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం.
Also Read: బీజేపీ కొత్త ఆపరేషన్
గ్రేటర్ పై పోల్ సర్వేలు ఏం చెప్తున్నాయి?
మొన్న దుబ్బాక ఎన్నికల్లో కూడా ఆరా సంస్థ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి పోరు భీకరంగా జరిగినా కారు గెలుస్తుందని చెప్పింది. కానీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచారు. దీంతో గ్రేటర్ పోల్ విషయంలో మరింత పకడ్బందీగా అంచనాలు విడుదల చేయాలని ఆ సంస్థ అధిపతి మస్తాన్ వలీ భావిస్తున్నారు. అలాగే మరికొన్ని ప్రైవేటు సంస్థలు కూడా గ్రేటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే పలు ప్రముఖ మీడియా సంస్థలు తమకున్న విశాలమైన పబ్లిక్ బేస్ను ఆసరా చేసుకొని ప్రజానాడి సేకరించాయి. కానీ కేవలం గ్రేటర్ నాడి ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.
Comments
Post a Comment
Your Comments Please: