Skip to main content

తక్కువ తేడాతో ఎక్కువ సీట్లు: ఇదెలా సాధ్యం? ఎవరి కుట్ర?

Also Read: ఆవు పేడతో చెప్పుల తయారీ

Weekend Story: కృత్రిమ చికెన్: నేటి నుంచే మార్కెట్‍లోకి

Weekend story: హండ్రెడ్ పర్సెంట్ హరామ్
Weekend Story:
 ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు

ప్రభుత్వాలు కంటికి కనిపించని కుట్రలకు పాల్పడతాయా? అలాంటి అవకాశం ఉంటుందా? రాజకీయాలను, వాటి చుట్టూ పెనవేసుకున్న ప్రయోజనాలను అర్థం చేసుకుంటే ఏమైనా జరగొచ్చని అనిపించక మానదు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఫలితాలను కాస్త లోతుగా పరిశీలిస్తే లోపాలతో పాటు.. కొన్ని కుట్రలు కూడా జరిగాయన్న విషయం తెలుస్తుంది. 

అధికార టీఆర్ఎస్, దూకుడు మీదున్న బీజేపీకి ఓట్ల శాతం చాలా తక్కువగా నమోదైంది. 35.73 శాతంతో 11,92,162 ఓట్లతో టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా.. 35.55 శాతంతో 11,86,096 ఓట్లు సాధించిన బీజేపీ రెండో స్థానంలో ఉంది. అంటే టీఆర్ఎస్ కు, బీజేపీకి 0.18 శాతం ఓట్ల స్వల్ప దూరం మాత్రమే ఉందన్నమాట. ఒక్క శాతం తేడా కూడా లేని ఓట్ల శాతంతో జీహెచ్ఎంసీలో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. ఇక 18.91 శాతంతో 6,30,867 ఓట్లు మాత్రమే పొందిన ఎంఐఎం 44 డివిజన్లలో జెండా ఎగరేసి మూడో స్థానంతో తన పట్టు నిలుపుకోగలిగింది. ఇక కాంగ్రెస్ 6.61 శాతంతో 2,20,504 ఓట్లు పొంది 2 సీట్లు మాత్రమే గెలవగా... టీడీపీ 1.65 శాతంతో 55,287 ఓట్లు పొంది ఒక్క సీటు కూడా పొందలేకపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే... టీఆర్ఎస్, బీజేపీలకు వచ్చిన ఓట్లు, సీట్లతో పోలిస్తే ఎంఐఎంకి ఎలా ఎక్కువ ఫలితాలు వచ్చాయి? మొత్తం ఓట్లలో 35.73 శాతం, 35.55 శాతం ఓట్లు సాధించిన టీఆర్ఎస్, బీజేపీలకన్నా చాలా తక్కువ ఓట్లు... అంటే 18.91 శాతం మాత్రమే వచ్చిన ఎంఐఎంకు ఈ స్థాయిలో సీట్లు ఎలా సాధ్యమయ్యాయి? 

టీఆర్ఎస్: 35.73 శాతం (11,92,162 ఓట్లు) 56 సీట్లు

బీజేపీ: 35.55 శాతం (11,86,096 ఓట్లు) 48 సీట్లు

తేడా: 0.18 శాతం మాత్రమే

ఎంఐఎం: 18.91 శాతం (6,30,867 ఓట్లు) 44 సీట్లు

ఎంఐఎం గెలిచిన డివిజన్లు అన్నీ ఆ పార్టీ ప్రాబల్యం అధికంగా ఉన్న పాతబస్తీ పరిధిలోనివేనని గమనించాలి. ఈ ప్రాంతంలో తక్కువ ఓటర్ల సంఖ్యతో ఎక్కువ డివిజన్లు ఏర్పాటు చేయడమే అందుక్కారణమని గమనించాలంటున్నారు ఎన్నికల నిపుణులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో ఓట్లు ఎక్కువ, డివిజన్లు తక్కువ.. ఈ వ్యత్యాసం జీహెచ్ఎంసీ డివిజన్లకే పరిమితం కాకుండా, అసెంబ్లీ నియోజకవర్గాలు, హైదరాబాద్ పార్లమెంట్ సీటు విషయంలో కూడా కనిపిస్తుంది. దశాబ్దంన్నర క్రితం డివిజన్లు, నియోజవర్గాల పునర్విభజన, సరిహద్దులను కుట్రపూరితంగా ఏర్పాటు చేశారని ఎన్నికల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే ఒకప్పుడు 5 లోపు ఉండే మజ్లిస్ అసెంబ్లీ సీట్లు 7 కి పెరిగాయి. జీహెచ్ఎంసీలో కూడా ఆ పార్టీ... జనాభా నిష్పత్తికన్నా ఎక్కువ సీట్లు పొందడం సాధ్యమవుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా హైదరాబాద్ లో ఎంఐఎంతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగిన దాఖలాలు కనిపిస్తాయి. గతంలో కాంగ్రెస్  అనుసరించిన పంథానే ఇప్పుడు టీఆర్ఎస్ అనుసరిస్తోంది. ఎన్టీఆర్ హయంలో టీడీపీ కూడా ఎంఐఎంతో కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పంచుకుంది. కనీసం వచ్చే ఎన్నికలనాటికైనా నిష్పాక్షికంగా డివిజన్లు, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇలాంటి అనారోగ్యకరమైన హెచ్చుతగ్గులకు బ్రేకు పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికలనాటికి అన్ని పార్టీలూ ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.