Skip to main content

జానారెడ్డి బీజేపీలో చేరడం ఖాయమేనా?

కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జూనారెడ్డి బీజేపీలో చేరడం ఖాయమేనా అంటే.. పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే అంతకంటే వేరే ఆప్షన్ కూడా ఆయనకు లేదని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. దేశమంతా కాంగ్రెస్ దెబ్బతిన్న క్రమంలో ఢిల్లీలో ఆయనకంటూ పెద్దదిక్కు ఎవరూ లేకపోవడం ఆయనకు పెద్దమైనస్ పాయింట్. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాక.. ఆ స్థానాన్ని రేవంత్ చేత భర్తీ చేద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ ఎంపిక కూడా దాదాపుగా ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే రేవంత్ దూకుడును, పోకడను, రాకడను ససేమిరా అంటున్న సీనియర్లు మాత్రం రేవంత్ వస్తే తాము పార్టీలో ఉండే ప్రశ్నే లేదని భీష్మించుక్కూర్చున్నారు. రేవంత్ వస్తే తమ ప్రాధాన్యత అసలు ఏమాత్రం లేకుండా పోతుందని, ఇన్నాళ్లూ ఉనికి చాటుకున్న పార్టీలో అసలు ఉనికే లేకుండా పడిఉండడం తమ వల్ల కాదని వారంటున్నారు. అందుకే దాదాపు గత ఏడాదిన్నరగా రేవంత్ టీ-పీసీసీ అనౌన్స్ మెంట్ ను తొక్కి పెట్టినట్లు సమాచారం. అయితే గ్రేటర్ ఫలితాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుపడే సూచనలేవీ కనిపించకపోవడంతో ఇదే అదనుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ప్లేస్ ను రేవంత్ చేత భర్తీ చేయడాన్ని జీర్ణించుకోలేని నేతలు పార్టీకి సామూహికంగా గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ పరిస్థితులను ఏమాత్రం సరిదిద్దే స్థితిలో లేని అధిష్టానం మధ్యేమార్గంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా పీసీసీ చీఫ్ గా ప్రకటించే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలున్నాయి.

 

ఇక జానారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా, సీనియర్ నేతగా నియోజకవర్గంలో మంచి గుర్తింపే కాక తెలంగాణవ్యాప్తంగా ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు. పైగా ఆయనకు పర్సనల్ గా ఢిల్లీ రాజకీయాల్లో పని చేయాలన్న ఆలోచన ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆయన మనోభీష్టం తీరాలంటే కాంగ్రెస్ లో సాధ్యమవుతుందా అన్నది ఎవరైనా సులభంగానే అర్థం చేసుకోవచ్చు. మరి ఢిల్లీలో అడుగు పెట్టాలంటే ఏం చేయాలి? ప్రత్యామ్నాయ పార్టీ వైపు అడుగులు వేయాలి. ఈ కారణంగానే ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తన కోరిక తీరాలన్నా.. కొడుకు రఘువీర్ రెడ్డికి రాజకీయ భవిష్యత్ కల్పించాలన్నా బీజేపీ తప్ప మరో మార్గం కనిపించడం లేదని జానా భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. 

మరోవైపు తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ప్రజలకు అందిద్దామని కంకంణం కట్టుకున్న బీజేపీ అధిష్టానం అందుకోసం ఎక్కడిదాకానైనా వెళ్లేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతలైన జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబు లాంటి వారిని లాగేసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. 


Comments

Popular posts from this blog

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?