కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జూనారెడ్డి బీజేపీలో చేరడం ఖాయమేనా అంటే.. పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే అంతకంటే వేరే ఆప్షన్ కూడా ఆయనకు లేదని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. దేశమంతా కాంగ్రెస్ దెబ్బతిన్న క్రమంలో ఢిల్లీలో ఆయనకంటూ పెద్దదిక్కు ఎవరూ లేకపోవడం ఆయనకు పెద్దమైనస్ పాయింట్. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాక.. ఆ స్థానాన్ని రేవంత్ చేత భర్తీ చేద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ ఎంపిక కూడా దాదాపుగా ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే రేవంత్ దూకుడును, పోకడను, రాకడను ససేమిరా అంటున్న సీనియర్లు మాత్రం రేవంత్ వస్తే తాము పార్టీలో ఉండే ప్రశ్నే లేదని భీష్మించుక్కూర్చున్నారు. రేవంత్ వస్తే తమ ప్రాధాన్యత అసలు ఏమాత్రం లేకుండా పోతుందని, ఇన్నాళ్లూ ఉనికి చాటుకున్న పార్టీలో అసలు ఉనికే లేకుండా పడిఉండడం తమ వల్ల కాదని వారంటున్నారు. అందుకే దాదాపు గత ఏడాదిన్నరగా రేవంత్ టీ-పీసీసీ అనౌన్స్ మెంట్ ను తొక్కి పెట్టినట్లు సమాచారం. అయితే గ్రేటర్ ఫలితాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుపడే సూచనలేవీ కనిపించకపోవడంతో ఇదే అదనుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ప్లేస్ ను రేవంత్ చేత భర్తీ చేయడాన్ని జీర్ణించుకోలేని నేతలు పార్టీకి సామూహికంగా గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ పరిస్థితులను ఏమాత్రం సరిదిద్దే స్థితిలో లేని అధిష్టానం మధ్యేమార్గంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా పీసీసీ చీఫ్ గా ప్రకటించే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలున్నాయి.
ఇక జానారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా, సీనియర్ నేతగా నియోజకవర్గంలో మంచి గుర్తింపే కాక తెలంగాణవ్యాప్తంగా ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు. పైగా ఆయనకు పర్సనల్ గా ఢిల్లీ రాజకీయాల్లో పని చేయాలన్న ఆలోచన ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆయన మనోభీష్టం తీరాలంటే కాంగ్రెస్ లో సాధ్యమవుతుందా అన్నది ఎవరైనా సులభంగానే అర్థం చేసుకోవచ్చు. మరి ఢిల్లీలో అడుగు పెట్టాలంటే ఏం చేయాలి? ప్రత్యామ్నాయ పార్టీ వైపు అడుగులు వేయాలి. ఈ కారణంగానే ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తన కోరిక తీరాలన్నా.. కొడుకు రఘువీర్ రెడ్డికి రాజకీయ భవిష్యత్ కల్పించాలన్నా బీజేపీ తప్ప మరో మార్గం కనిపించడం లేదని జానా భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.
మరోవైపు తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ప్రజలకు అందిద్దామని కంకంణం కట్టుకున్న బీజేపీ అధిష్టానం అందుకోసం ఎక్కడిదాకానైనా వెళ్లేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతలైన జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబు లాంటి వారిని లాగేసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం.
Comments
Post a Comment
Your Comments Please: