Skip to main content

వీకెండ్ స్టోరీ-ఏపీలో విగ్రహాల విధ్వంసకాండ ఆపాల్సింది ఎవరు?

ఏపీలో ఏ జిల్లా చూసుకున్నా విధ్వంసకాండ మాత్రం కామన్ గా మారింది. జ్యోతిర్లింగ రూపంలో పరమశివుడు కొలువుదీరిన శ్రీశైలం నుంచి దేశప్రజలందరికీ ఆరాధ్య దైవమైన రామతీర్థం రాములవారి క్షేత్రం దాకా ఎక్కడ చూసినా మత విద్వేషం బుసలుకొడుతోంది. హిందువుల సెంటిమెంట్లను పనిగట్టుకొని గాయపరచడమే ప్రధానమైన ఎజెండాగా కనిపిస్తోంది. అయినా పాలకులకు గానీ, అధికారులకు గానీ ఆ విషయాలేవీ పట్టటం లేదు. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగానూ అదే రిపీటైంది. 

Also Read: తక్కువ తేడాతో ఎక్కువ సీట్లు: ఇదెలా సాధ్యం? ఎవరి కుట్ర?

Also Read: ఒవైసీ వ్యూహం వెనుక ఏముందంటే..


పిల్లి కళ్లు మూసుకుంటే ఎలుకొచ్చి వెక్కిరిస్తుందని సామెత. ఆ ఎలుక ఇంకా ఏం చేస్తుందో మాటల్లో చెప్పడం బాగుండదు కానీ.. ఆంధ్రాలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయి, ఆనందం అనుభవిస్తున్న సమయంలో.. ఏపీలో మాత్రం దుండగుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరికొద్ది సమయంలో తెల్లవారుతుందనగా రాజమండ్రిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి చేతులు విరిచేశారన్న వార్త మీడియా ద్వారా ప్రపంచానికి చేరింది. అంతకు కొద్ది గంటల ముందే, డిసెంబర్ 30న విజయనగరం జిల్లా రామతీర్థం కొండమీదున్న రాముడి విగ్రహం తల నరికి బావిలో పడేశారు. ఆ దృశ్యం చూస్తుంటే.. రామరాజ్యం గురించి మన గాంధీజీ కానీ, మన పెద్దవారు కానీ గొప్పగా చెప్పిన మాటలు.. మన ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఎంతగా ప్రతిఫలిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. 

విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికిన దృశ్యం
రాజమండ్రిలో సుబ్రమణ్యేశ్వరస్వామి చేతులు, కాళ్లు నరికివేత
విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం

ఆంధ్రాలో కేవలం ఈ రెండు సంఘటనలేనా? అబ్బో.. ఇలాంటి ఘనకార్యాలు ఏపీలో చాలానే జరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలోనూ హిందూ దేవతా విగ్రహాల విధ్వంసకాండ నిరాటంకంగా సాగిపోయింది. ఇప్పటికీ సాగిపోతోంది. హిందూ సెంటిమెంట్ల గురించి తప్ప అన్ని ఇతర మతాల సెంటిమెంట్లకూ టాప్ ప్రయారిటీ ఇచ్చే పాలకులు... దేవలయాలపై దాడులపై శ్వేతపత్రం విడుదల చేయకపోవచ్చు కానీ.. గూగులమ్మను అడిగితే ఆ జాబితా ఏదో ప్రపంచం కళ్లముందు పెడుతుంది. గతేడాది సెప్టెంబర్ 17న కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేటలో కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలోని నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇది చాలా పురాతన దేవాలయం 12వ శతాబ్దంలో కాకతీయులు ఇక్కడ వీరభద్రస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ మరుసటి రోజే యేలేశ్వరంలో హనుమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. సెప్టెంబర్ 6న అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథాన్ని కాల్చేశారు. ఈ రథానికి వందల ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉంది. ప్రజలంతా పట్టరాని ఆగ్రహంతో ఆందోళనలు చేశారు. దుండగులెవరో పట్టిచూపే సీసీటీవీలు కూడా ఆ టైమ్ కి పని చేయకపోవడంలోనే.. అంతర్వేది ఘటనలో కాకతాళీయత ఎంతుంది.. కాకమ్మ కబుర్లు ఎన్నున్నాయి అనేది చెప్పకనే చెబుతోంది. అందుకే అధికారులు ఈవో ను సస్పెండ్ చేసి ప్రజాగ్రహాన్ని తప్పించుకునే ప్రయత్నం చేశారు. 

ఏపీలో హిందూ దేవాలయాలపై దాడుల లిస్టు కొండవీటి చాంతాడును మించిపోతుంది. అమ్మల గన్నయమ్మ బెజవాడ దుర్గమ్మగా భక్తుల కష్టాలు తీర్చే అమ్మవారి రథం మీది విగ్రహాలు కూడా మాయమైపోయాయి. దుర్గగుడిలో వెండి విగ్రహాలకే రక్షణ లేదంటే.. చిన్నచిన్న పుణ్యక్షేత్రాల సంగతేంటి? అంతకుముందు సెప్టెంబర్ 26న గంగాధర నెల్లూరులో దుండగులు నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నెల్లూరులో ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథాన్ని కాల్చి బుగ్గి చేశారు. బూడిద కుప్ప తప్ప.. రథం ఆనవాళ్లు కూడా మిగల్చలేదు. ఇక తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో హిందూ దేవీ-దేవతా విగ్రహాల విధ్వంసం ప్రపంచాన్ని నివ్వెరపరచింది. గణేశుడు, హనుమాన్, సాయిబాబా, దుర్గామాత ల విగ్రహాలను ధ్వంసం చేసి.. యవనులు, హూణుల కన్నా తామేం తక్కువ కాదని చాటుకున్నారు. ఆ విగ్రహాలు కూల్చడానికి భారీ సమ్మెటలే వాడారంటే... హిందూ ధర్మం మీద, హిందువుల ఆచరణల మీద.. ఈ దుర్మార్గులకు ఎంత విద్వేషం ఉందో ఊహించవచ్చు. మొన్నటికి మొన్న క్రిస్మస్ రోజున.. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సోదరుడు గోవిందమాలలో ఉండి ఏసుకీర్తనలు ఆలాపించాడు. పక్కనే ధర్మశ్రీ కూడా ఉన్నారు. 

అసలు హిందూ దేవాలయాల వల్ల ఇతరులకు ఏం నష్టమొచ్చింది? వారికొచ్చిన ఇబ్బందేంటి? నిశ్శబ్దంగా తమ సంప్రదాయాలు పాటించడమే హిందువులు చేస్తున్న తప్పా? ఇన్ని జరుగుతున్నా పాలకులకు చీమ కుట్టినట్టయినా ఎందుకు ఉండడం లేదు? ఎమ్మెల్యేదో, ఎంపీదో బొచ్చు కుక్క కనిపించకపోతే నానా హైరానా పడిపోయే అధికారులు, బడాబాసులు.. కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్లకు మాత్రం విలువ ఇవ్వకపోవడంలో ఆంతర్యమేంటి? ఏపీలో ఇలాంటి దురాగతాలు అర్ధసెంచరీ దాటిపోయాయి. అసలు ఈపాటికే సీబీఐ విచారణకు రూట్ క్లియర్ చేయాల్సింది. కానీ ఎందుకని పట్టించుకోవడం లేదు? మన దేశంలోని మెజారిటీ ప్రజలు సహజంగానే శాంతి స్వభావులు. వారిలో ఎన్ని విభేదాలున్నా, ఎన్ని హెచ్చుతగ్గులున్నా సెంటిమెంట్లు హర్టయితే మాత్రం సహించజాలరు. ప్రజల సెంటిమెంట్లు హర్టయిన చోట ప్రభుత్వాలకు ఏం రుచి చూపారో ఇప్పటికే చూశాం. అలాంటి పరిస్థితిని ఏపీ పాలకులు తెచ్చుకోకుంటే మంచిదని కోరుకోవడం మినహా.. ఇతరులు చేయగలిగిందేమీ లేదు.


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

మోడాల చంద్రశేఖర్ కు గౌరవ డాక్టరేట్

సీనియర్ పాత్రికేయుడు మోడాల చంద్రశేఖర్ కు జి.హెచ్.పి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి విహార్, శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ 34 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పలు పరిశోధనాత్మకమైన కథనాలు అందించారు. అంతేకాకుండా ధ్యాన సైన్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన యూనివర్శిటీవారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఆయన సేవలకు గాను ఇప్పటికే రాష్ట్రస్థాయిలో స్ఫూర్తి రత్న వంటి అవార్డులు, ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శీటీ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డా. పి.రవీందర్, చెన్నయ్ సైబర్ క్రైమ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తంగరాజు, ఎన్ఏఐ జనరల్ సెక్రటరీ డా.విపుణ్ గౌర్, జీహెచ్ పీయు తమిళనాడు, పాండిచ్చేరి రీజియన్ జాయింట్ డైరెక్టర్ లు డా. వళ్ళార్ మతి, శుభాస్ షా, నామినేషన్ కమిటీ మెంబర్ బొడుసు మాధవి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు అందజేసి తన బాధ్యతను మరింత పెంచిన ...