Skip to main content

మన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయమిదే

భారతీయ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయం ఆసన్నమైందని హైదరాాబాద్ కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ ఎంబీఆర్ కామేశ్వరరావు అంటున్నారు. గతేడాదికి పైగాా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న సమయం నుంచీ శాస్త్రీయ వైద్యంగా భుజకీర్తులు తగిలించుకున్న అల్లోపతి వైద్యం ఇప్పటివరకు దాని స్వభావాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయిందని, అయినా పాలకులు, ప్రపంచ దేశాలు, డబ్ల్యు.హెచ్.ఒ వంటి వ్యవస్థలన్నీ ఇప్పటికీ పునరాలోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నాానికి చెందిన ఆనందయ్య ఇప్పటికే 20 వేల మందికి పైగా కరోనా పేషెంట్లకు ప్రాణభిక్ష పెడితే దాన్ని నాటువైద్యంగా అభివర్ణిస్తున్న ఆధునిక మీడియా పోకడలను ఆయన ఖండించారు. 


ఏది నాటు వైద్యం? ఏది శాస్త్రీయ వైద్యం?

శాస్త్రీయ వైద్యం పేరుతో లక్షల్లో ఫీజులు గుంజుతూ, పేషెంట్ ప్రాణాలు పోతే తమకు సంబంధం లేదని సంతకం చేయించుకుని మరీ ట్రీట్మెంట్ మొదలుపెట్టే కార్పొరేట్ దవాఖానాాల్లో జరిగేది శాస్త్రీయ వైద్యం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ప్రాణాలు పోతే ప్రశ్నించే అవకాశాన్ని కూడా లేకుండా చేసేదాన్ని శాస్త్రీయ వైద్యంగా పిలిచేవారి అజ్ఞానానికి జాలిపడాల్సిందేనన్నారు. ఆయుర్వేదంలో అనేక రోగాలకు మందులు ఉన్నాయని, ఎంతో విలువైన ఆ విజ్ఞానాన్ని నాటువైద్యం పేరుతో ప్రజలకు దూరం చేసే కుట్ర దశాబ్దాలుగా దేశంలో విజయవంతంగా అమలైందన్నారు. చదువుకున్నవారు, మీడియా సంస్థల అజ్ఞానం వల్లే ఆయుర్వేద వైద్యులు నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో డబ్బులు కట్టినా ప్రాణాలు పోతున్న క్రమంలో ఆనందయ్య అందిస్తున్న చికిత్స కరోనా పేషెంట్లకు దివ్యౌషధంగా మారిందని, ఈ ఉదంతం వల్ల ప్రభుత్వాల్లో కాసింతైనా చలనం రావడం సంతోషదాయకమన్నారు. ఒక్క కరోనాకే కాదని, ఆధునిక వైద్య విధానానికి అంతుబట్టని అనేక రోగాలకు ఆయుర్వేదంలో చికిత్స ఉందని గుర్తించాలని కామేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఆనందయ్య లాంటి ఎంతో మంది ఆయుర్వేద వైద్యులు వెలుగులోకి రాకుండా నాటువైద్యులుగా తెరమరుగైపోయారని, ఇప్పుడైనా దేశీయ వైద్యానికి మంచిరోజులు రావాలని ఆకాంక్షించారు. అయితే ప్రజలే ముందుకొచ్చి ఆయుర్వేదాన్ని బతికించుకుంటే ప్రభుత్వాలు చచ్చినట్టు గుర్తిస్తాయని, నెల్లూరు సంఘటన ఇందుకు ఓ తాజా ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాల కళ్లు తెరిపించే సత్తా ప్రజలకే ఉందని, ఆయుర్వేదానికి మద్దతుగా నిలబడాల్సింది కూడా ప్రజలేనన్నారు. వైద్య వృత్తిలోకి వస్తున్న ఎవరైనా వారికి నిర్దేశించినట్టు ఐదేళ్ల కోర్సు పూర్తి చేసుకొని వృత్తిని చేపడుతున్నారు. అయితే అల్లోపతి డాక్టర్ల చేతిలో ఏదైనా పొరపాటు జరిగితే లేదా అనుకోని సంఘటన జరిగితే ప్రాక్టీసులో భాగంగా, శాస్త్రీయమైన ప్రాక్టీసులో భాగంగా పరిగణిస్తున్న, ప్రచారం చేస్తున్న వ్యవస్థలు లేదా సంస్థలు... ఇతర వైద్య విధానాల్లో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు.. దాన్ని తెలిసీ తెలియని వైద్యంగా, అశాస్త్రీయ వైద్యంగా పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. వైద్యులు అయిదేళ్ళు పూర్తిచేసుకుని, పట్టా పుచ్చుకొని, రోగులకు శాయశక్తులా నయం చేస్తామని ప్రమాణం చేశాకే వైద్య వృత్తిని అవలంబిస్తున్నారు. కానీ బుద్ధిజీవులు అందరూ ఈ విషయాలను కావాలనే విస్మరిస్తున్నారని కామేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
కామేశ్వరరావు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తొలితరం ఆయుర్వేద వైద్యుడు. 20 ఏళ్లుగా ఆయన  ఆయుర్వేదం మీదనే అనేక పరిశోధనలు చేసి ఇప్పటికి దాదాపు 70 రకాల మందులు సొంతంగా తయారు చేశారు. సురభి ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో సొంత ప్రయోగశాలను నడుపుతున్నారు. తన ల్యాబ్ లో తయారవుతున్న ఆయుర్వేద మందులు వందశాతం సహజసిద్ధమైనవని, సువాసన కోసం గానీ, కలర్స్ కోసం గానీ ఎలాంటి కృత్రిమ పదార్థాలు కలపడం లేదని, అందువల్లే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తన మందులకు ప్రజల్లో ఆదరణ లభిస్తోందన్నారు. వికలాంగుడైన డాక్టర్ కామేశ్వరరావు తన పరిస్థితిని లెక్క చేయకుండా వారధి ఫౌండేషన్ పేరుతో పేదలకు క్రమం తప్పకుండా రేషన్ సరుకులు అందిస్తుండడం విశేషం. 

Comments

Popular posts from this blog

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?