Skip to main content

ఈటలతో జతకట్టిన ఏనుగు రవీందర్ రెడ్డి

హరీష్ రావు ఆత్మీయ సహచరుడు రవీందర్


ఉత్తర తెలంగాణలో సీనియర్ టిఆరెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తిరుగుబాటు నేత ఈటెల రాజేందర్ తో జతకట్టనున్నారు..గురువారం రాత్రి ఏనుగు రవీందర్ రెడ్డి నేరుగా ఈటెలను కలిసి సంఘీభావం ప్రకటించారు.. 

ఈ పరిణామం టిఆరెస్ లో  సంచలనం సృష్టిస్తోంది.. మంత్రి హరీష్ రావు కు అత్యంత నమ్మకమైన రాజకీయ సహచరుడిగా మెదులుతున్న ఏనుగు రవీందర్ రెడ్డి ఈటెలను కలవడం రాజకీయ ప్రకంపనలకు దా రితీయబోతోంది..2004 ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేసిన రవీందర్ రెడ్డి వరుసగా మూడుసార్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు..15 ఏళ్ళ పదవీ కాలంలో హరీష్ రావు వెంటే నీడలా ఉన్నారు..పొద్దున్నుండి రాత్రి వరకు హరీష్ వెంటే ఉండేవారు..2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే సురేందర్ చేతిలో ఓడిపోయినప్పటికి…హరీష్ రావు తో బంధం వీడలేదు..

కొద్దికాలానికే కాంగ్రెస్ నుంచి సురేందర్ కారెక్కడంతో సిట్టింగ్ హోదాలో ఉన్న జాజులను కాదనే పరిస్థితి లేకుండా పోయింది హరీష్ రావు కు..అయినా రవీందర్ రెడ్డి తో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు హరీష్ రావు..సిట్టింగ్ ఎమ్మెల్యే సురేందర్,తాజా మాజీ ఎమ్మెల్యేగా ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి గడ్డపై దాయాదుల మాదిరిగానే వ్యవహరించారు.. ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది..

 ఒక ఒరలో రెండు కత్తుల వలె వ్యవహారం ముదరడంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులకంటే తన వెంట ఉన్న అనుయాయుల పనులు పోటీ పడి చేయిస్తూ ఏనుగు రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకుంటున్నారు.. దీంట్లో రెండేళ్లు మంత్రి ఈటెల రాజేందర్ సహకారం తీసుకున్నారు ఏనుగు..దీనికి తోడు హరీశ్రావ్..ఈటెలతో 20 ఏళ్ల రాజకీయ అనుబంధం సైతం రవీందర్ రెడ్డిని ఈటెల దరిచేర్చింది..    

సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో…సమయం చూసి అడుగేయడంలో రవీందర్ రెడ్డి సిద్ద హస్తుడు.. మొన్నటి వరకు అనుయాయులందరు కట్టకట్టుకొని బీజేపీలో చేరడం ద్వారా టిఆరెస్ కు షాక్ ఇద్దామని రవీందర్ రెడ్డిపై తీవ్రంగా ఒత్తిడి పెంచారు..అయితే ఇది సరైన సమయం కాదని..కొద్ది కాలం వేచిచూద్దామని క్యాడర్ కు నచ్చ చెప్పారు..

అప్పటికే ఈటెల రాజేందర్ వ్యవహారంపై ఉప్పందడం వల్లనే క్యాడర్ను కొద్ది టైమ్ అడిగినట్లు కనపడుతోంది.. టిఆరెస్ తరపున 2004 లో సంతోష్ రెడ్డి,కేశపల్లి గంగారెడ్డి తో పాటు రవీందర్ రెడ్డి అసెంబ్లీ మెట్లెక్కారు.. అప్పటి నుంచి టిఆరెస్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖుడిగా ఎదిగారు.. కేసీఆర్ కు సన్నిహితంగా  ఉంటూనే…ఉమ్మడి నిజామాబాద్ టిఆరెస్ రాజకీయాల్లో చక్రం తిప్పారు…ఉత్తర తెలంగాణ స్థాయిలో ముఖ్య నేతగా ఎదిగిన ఏనుగు రవీందర్ రెడ్డి ఈటెల రాజేందర్ తో జతకట్టిన బడా నేతల్లో మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకోబోతున్నారు.. ఆరు రోజుల రాజకీయ సమికరణాలలో టిఆరెస్ లో ఈ స్థాయి కలిగిన నేత  బాహాటంగా ఈటెలను కలిసిన సందర్భం లేకపోవడం గమనార్హం.. ఇప్పటిదాకా ఈటెలకు మద్దతు తెలిపిన టిఆరెస్ నేతల్లో మండల స్థాయి నేతలే ఉన్నారు..ఉన్నా వారంతా హుజురాబాద్ ప్రాంత నేతలే…ఏనుగు రవీందర్ రాజకీయ మలుపు సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపింది…

Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?