Skip to main content

అద్భుతమైన సినిమా - చెత్త మెసేజ్

శ్యామ్ సింగారాయ్ సినిమా చాలా మంచి కళాత్మక విలువలున్న సినిమా. చిత్రీకరణ, ఫోటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. ఈ సినిమాలో నాని టైటిల్ రోల్ కు న్యాయం చేశాడు. హీరోయిన్ సాయి పల్లవి కూడా బాగా నటించింది. మంచి పాత్ర ను ఎంచుకోడంలో సాయి పల్లవి ఎప్పుడూ ముందుంటుంది. ఈ సినిమాకు హైలెట్ హీరో నాని పాత్ర శ్యామ్ సింగరాయి , చాలా హుందాగా ఉంది పాత్ర. హీరోయిన్ డాన్స్ బాగా చేసింది. కథక్ నృత్యం చేస్తూ ఒక సీన్ లో ఆమె చేసే నాట్యం ఎక్సలెంట్ గా ఉంది. ఆ పాత్రకు ఆమె సరిపోయింది. 

కథ విషయానికి వస్తే, హీరో సినిమా డైరెక్టర్. 2020 లోమొదటి సినిమా తీసి హిట్ సాధిస్తాడు. అతను పేరు సాధిస్తాడు. అనుకోకుండా అతను ఒక కేసులో  ఇరుక్కుని పోతాడు. ఆ కేసు నుండి బయట పడడానికి అతన్ని, సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్తే, ఆమె అతని ద్వారా చాలా విషయాలు తెలుసుకొంటుంది.

సినిమా 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళి శ్యామ్ సింగరాయ్ దగ్గరకు వెళుతుంది. అతను ఒక బెంగాల్ కవి, అతని తల్లి తెలుగామే, కాబట్టి తెలుగు కూడా వస్తుంది. హీరో , 4 అన్నతమ్ముల్లో చిన్నోడు. వారిది ఉన్నత కుటుంబం, అభ్యుదయ భావాలు కలిగిన అతడు నాస్తికుడు, దేవుని నమ్మడు. కులానికి, మతాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాడు. అతను ప్రజల కోసం పోరాడే ఒక సామాజిక కార్యకర్త, కవి.

అనుకోకుండా దసరా నవరాత్రి ఉత్సవాల్లో గుడిలో డాన్స్ చేస్తున్న హీరోయిన్ను చూస్తాడు. ఎప్పుడూ గుడికి వెళ్ళని హీరో... ప్రతిరోజూ ఉత్సవాలకు వెళ్తూ, హీరోయిన్ ను ప్రేమిస్తాడు.

హీరోయిన్ ఒక దేవదాసి (దేవుడికి ఇస్తామని చెప్పి బాలికలను దేవుడి బార్య పేరుతో గుడులలో ఉంచుతారు. జీవితం మొత్తం వారిని పూజారులు వాడుకుంటూ ఉంటారు). రోజు రాత్రి గుడి మహంత (పెద్ద పూజారి) ఒక అమ్మాయితో గడుపుతాడు. సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉంటుంది. హీరో ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుని కలకత్తా తీసుకెళ్ళి అక్కడ తన రచనలను కొనసాగిస్తాడు. ఈ సినిమాలో  హీరో 1970 లలో హత్య కావించబడటాడు..హీరోయిన్ 80 సంవత్సరాల వయస్సులో,అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

*****

హీరో: "నేను ప్రపంచం గురించి రాస్తూ ఉంటాను"

హీరోయిన్: "మరి నాగురించి ఎప్పుడు రాస్తావు?"


"నేను వెళ్తాను

నేను రాస్తాను"

లాంటి డైలాగ్ లు బాగున్నాయి.


నీ విలువ నీకు తెలియదు, నాతో రా! అని హీరో అంటే, "అర్ద మూట బియ్యం కోసం మా అమ్మ నన్ను  చిన్నప్పుడే అమ్మేసింది. అది నా విలువ" అంటుంది.


"మా మీద హక్కు ఆ దేవుడికి కూడా లేదు",

"ఆ నీరు దళితులు తాగితే అంటారానిడైతే, మరి వారు పీల్చిన గాలి మీరెందుకు పీలుస్తున్నారు",

"నీ వల్ల మా పరువంతా పోయింది, నిన్ను చంపితే కాస్తయినా మా పరువూ నిలబడుతుంది"

అమ్మాయి తలను, కళ్ళను,పెదవులను, జుట్టును వర్ణిస్తూ కవిత్వం చెప్పే సీన్ బాగుంటుంది.


"మైత్రేయి! ఇన్ని ముళ్ళ మద్య కూడా నువ్వు  వికసిస్తున్నావు, నీ పేరు ఇప్పటి నుండి రోసీ(Rosy)"

లాంటి డైలాగ్ లు బాగున్నాయి. "అమావాస్య రోజు, నీ ఒడిలో నేను చచ్చిపోతే నాకు గౌరవం" అని వయస్సులో అన్న హీరోయిన్    పునర్జన్మ ఎత్తిన ప్రీయున్ని  తన వృద్దాప్యంలో  అతని వొడిలో చనిపోవడం తో కథ ముగుస్తుంది.

చాలా అద్భుతమైన సినిమా....

ఫోటోగ్రఫీ ,డైలాగ్ లు సూపర్...

కానీ పునర్జన్మ అనే కాన్సెప్ట్ బాగాలేదు. సందేశం బాగా లేదు, హీరోయిన్ తన హావభావాలను పలికించడానికి కూడా నాట్యాన్ని చూపారు. కవిగా,సంస్కర్త గా, సోషల్ ఆక్టివిస్ట్ గా హీరో నాని అద్భుతంగా నటించాడు. డైరెక్షన్ బాగుంది. పునర్జన్మ కాన్సెప్ట్ తప్ప, మిగిలిన సినిమా మొత్తం సూపర్. శ్యామ్ సింఘారాయ్ సినిమా చూసిన తర్వాత మంచి సినిమా చూసాను అనే ఫీలింగ్ కలిగింది.

- చీపాటి రాజేశ్వరరావు

Also Read: శ్యామ్ సింగ్ రాయ్ - ఏం ఖర్మ రా భాయ్

Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.