Skip to main content

అన్ని సర్వేలూ అదే చెబుతున్నాయి.. ఒక్కటి తప్ప

ఓటరన్న తన పని తాను కానిచ్చేశాడు. తనను సంప్రదించిన పార్టీలతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాడు. మీట నొక్కాల్సిన చోట నొక్కాడు. నిశ్శబ్దంగా తన రొటీన్ వర్క్ లోకి వెళ్లిపోయాడు. మరి ఆ ఓటరు ఏ మీట నొక్కాడు.. ఎవరి మీటరు మార్చబోతున్నాడు.. ఎవరి తలరాత మారబోతుంది? మునుగోడులో ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయి? ఆ కీలకమైన విషయాలు మీకోసం. 

మునుగోడులో పరుగుపందెంలా మారిన ఉపఎన్నికలో హుజూరాబాద్ ఫలితం రిపీట్ కాకూడదన్న పట్టుదలతో టీఆర్ఎస్... మరో హుజూరాబాద్ లా మార్చేయాలన్న వ్యూహంతో బీజేపీ శ్రేణులు పనిచేశాయి. సర్వే సంస్థలు కూడా ఈ పోటీ తీవ్రతను అర్థం చేసుకొని.. అదే స్థాయిలో ఓటర్ల నాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాయి. అత్యధిక సర్వే సంస్థలు టీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేయగా.. ఒకటీ, అరా సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. ఆయా సర్వే సంస్థల రిపోర్టును ఆసరా చేసుకొని పార్టీలు కూడా గెలుపు తమదేననే ధీమాలో ఉన్నాయి. 

థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 48 నుంచి 51 శాతం ఓట్లు సాధిస్తుంది. బీజేపీ 31 నుంచి 35 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంటుందని పేర్కొంది. 13 నుంచి 15 శాతం ఓట్లతో కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంటుందని అంచనా వేసింది. బీఎస్పీ 5 నుంచి 7 శాతం ఓట్లు కైవసం చేసుకుంటుందని, ఇతరులు 2 నుంచి 5 శాతం ఓట్లు పొందే అవకాశం ఉందని థర్డ్ విజన్ అంచనా వేసింది. 

మరో సర్వే సంస్థ అయిన ఎస్.ఎ.ఎస్ గ్రూప్ కూడా టీఆర్ఎస్ అభ్యర్థే గెలుస్తారని అంచనా వేసింది. 41 నుంచి 42 శాతం ఓట్లతో టీఆర్ఎస్ గెలుస్తుందని, 35 నుంచి 36 శాతం ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుందని, కాంగ్రెస్ అభ్యర్థి 16న్నర నుంచి 17న్నర శాతం ఓట్లు పొందే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇక బీఎస్పీకి 4 నుంచి 5 శాతం ఓట్లు, ఇతరులకు ఒకటిన్నర నుంచి 2 శాతం ఓట్లు పోలవుతాయని అంచనా వేసింది. వీరు కాకుండా పలు ఇతర సర్వే సంస్థలు కూడా దాదాపు ఇదే రకమైన అంచనాతో రిపోర్టులు వెలువరించడం విశేషం. 

ఇక నేషన్ ఫ్యామిలీ ఒపీనియన్ ఎగ్జిట్ పోల్ కూడా అలాంటి రిపోర్టే ఇచ్చింది. 

టీఆర్ఎస్- 42.11 శాతం,  బీజేపీ-     35.17 శాతం,  కాంగ్రెస్-    14.07 శాతం,  బీఎస్పీ-     2.95 శాతం,  ఇతరులు-  5.70 శాతం

ప్రముఖ తెలుగు దినపత్రిక, జనంసాక్షి మీడియా సంస్థ మునుగోడు పల్స్ పట్టుకునేందుకు పెద్దఎత్తున కసరత్తు చేసింది. గతంలో హుజూరాబాద్ బైపోల్ లో పలు సర్వే సంస్థలు టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పగా.. జనంసాక్షి మాత్రం బీజేపీ గెలుస్తుందని కుండబద్దలు కొట్టింది. అలాంటి క్రెడిబిలిటీ సంపాదించుకున్న జనంసాక్షి ఈసారి కూడా అదే పద్ధతిలో పని చేసింది. జనంసాక్షి ఇచ్చిన రిపోర్టు ఇలా ఉంది. 

టీఆర్ఎస్: 45-52 శాతం,  బీజేపీ:     29-34 శాతం,  కాంగ్రెస్:    16-18 శాతం,  బీఎస్పీ:     4-5 శాతం

మునుగోడు బైపోల్ కోసం ప్రముఖ దినపత్రిక పోలీస్ నిఘా పటిష్టమైన సర్వే నిర్వహించింది. మునుగోడు మండలంలో బీజేపీదే పైచెయ్యిగా ఉంటుందని, చౌటుప్పల్ మండలంతో పాటు మున్సిపాలిటీలో పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా ఉందని, మున్సిపాలిటీలో మాత్రం బీజేపీ హవా హవా కొనసాగుతుందంటున్నారు. నారాయణపూర్ మండలంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ. కానీ కాంగ్రెస్‎దే పైచేయిగా ఉంటుంది. మర్రిగూడ మండలంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. స్వల్ప శాతంతో బీజేపీ ముందుంటుంది. చండూరులో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నా టిఆర్ఎస్ దే పైచేయిగా నిలుస్తుంది. నియోజకవర్గంలో 2018లో 2లక్షల 11వేల పైచిలుకు ఉన్న ఓట్లు నేడు కొత్తగా నమోదైన ఓటర్లతో 2,41,805 నమోదయ్యాయి. దీంతో అభ్యర్థుల గెలుపోటములను కొత్త ఓటర్లే తేల్చే అవకాశాలున్నాయి. మొత్తమ్మీద 2వేల నుండి 5 వేల ఓట్ల లోపు మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశాలున్నట్లు పోలీస్ నిఘా పత్రిక అంచనా వేస్తోంది. మెజారిటీలో 1000  ప్లస్ లేదా మైనస్ ఉండే చాన్సుంది. 

బీజేపీ: 36.9 శాతం,  టీఆర్ఎస్: 35.5 శాతం,  కాంగ్రెస్: 23.0 శాతం,  బీఎస్పీ: 3.2  శాతం,  ఇతరులు: 1.4 శాతం

మరో ప్రముఖ సర్వే సంస్థ అయిన ఆరా గ్రూపు టీఆర్ఎస్ 50 శాతానికి పైగా ఓట్లు నమోదు చేస్తుందని అంచనా వేసింది. 

2018 ఎన్నికల్లో మునుగోడులో 91.3 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి 93.13 శాతానికి పెరిగింది. అంటే 3.1 శాతం మంది ఓటర్లు అదనంగా ఓటుహక్కు వినియోగించుకున్నారన్నమాట. అయితే ఈ భారీ పోలింగ్ ప్రభుత్వం మీద వ్యతిరేకతనా లేక ప్రభుత్వానికి అనుకూలమా అన్నదానిమీదనే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.