Skip to main content

వీరభద్ర విజయం - ఒక పర్ఫెక్ట్ సర్జికల్ స్ట్రయిక్

సర్జికల్ స్ట్రయిక్ అంటే 2016లో భారతదేశం పాకిస్తాన్ మీద చేసిందే అనుకుంటారు అందరూ. కానీ అది ఓ కొనసాగింపు మాత్రమే. అలాంటి సర్జికల్ స్ట్రయిక్, అంతకన్నా ప్రమాదకరమైంది, అంతకన్నా ఎన్నో రెట్ల భయంకరమైంది భారతీయ పురాణ కాలంలోనే జరిగింది. ఆ సర్జికల్ స్ట్రయిక్ నిర్వహించిన రుద్రమూర్తే వీరభద్రస్వామి. బహుశా దాన్ని మొట్టమొదటి సర్జికల్ స్ట్రయిక్ గా భావించవచ్చేమో. 
శత్రువు చేతిలో జరిగిన అవమానానికి ప్రతీకారమే సరైన చర్య. అవమానించడానికి శత్రువే కానక్కర లేదు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ అయినా సరే.. అవమానించాడంటే శత్రువు కిందే లెక్క. సాక్షాత్తూ పరమశివుడు కూడా అదే సూత్రాన్ని పాటించాడు. అల్లుణ్ని అవమానించడానికే దక్ష ప్రజాపతి యజ్ఞం తలపెట్టాడట. తండ్రి పిలవకపోయినా ఓ గొప్ప కార్యాన్ని, శుభకార్యాన్ని తలపెట్టాడు కాబట్టి వెళ్లొస్తానని శివుని దగ్గర బలవంతంగా అనుమతి తీసుకొని వెళ్లిపోయింది పార్వతి. దుర్బుద్ధితోనే యజ్ఞం తలపెట్టిన దక్షుడు.. కూతురు ముందే అల్లుణ్ని దారుణంగా అవమానించాడు. శివుడికి కూతురును ఇచ్చి పెళ్లి చేయడమే ఇష్టం లేని దక్షుడు.. కూతురే ఇష్టపడి చేసుకోవడంతో ఏమీ అనలేకపోయాడు. కానీ అల్లుడి మీద, అల్లుడి పేదరికం మీదా, ఆడంబరాలకు ఏమాత్రం విలువ ఇవ్వని ఆయన వైరాగ్యం మీద, బిచ్చమెత్తుకుంటే తప్ప పూట గడవని శివుడి దైన్యం మీద దక్షుడికి ఏమాత్రం గౌరవ భావం లేదు. ఆదరణ అసలే లేదు. ఇలాంటి తరుణంలో పిలవని పేరంటానికి వచ్చిన కూతురును సాకుగా తీసుకొని అల్లుడి మీద వాగ్బాణాలు సంధించాడు. ఘోరంగా అవమానించాడు. వెకిలిగా విమర్శించాడు. ఆ యజ్ఞానికి అతిథులుగా వచ్చిన దేవతలందరి ముందూ తన భువనైక నాథుడిని సాక్షాత్తూ తండ్రే ఛీత్కరించడంతో పార్వతీదేవి మనసు కలుక్కుమంది. అలా అందరి ముందూ జరిగిన అవమానం తరువాత బతికి ఉండడం అనేది చావు కన్నా దారుణం. అది కూడా అక్కడ ఆహూతులుగా వచ్చిన దేవీదేవతలందరూ కొలిచే శివుణ్నే అవమానించాక.. తానిక బతికిి ఉండడంలో అర్థం లేదనుకుంది. యోగాగ్ని రాజేసుకొని మంటల్లో ఆహుతైంది.
అక్కడ కైలాసనాథుడికి ఈ దుర్వార్త తెలిసింది. ముక్కు అదిరింది. మూడోనేత్రం నిప్పులు చిమ్మింది. తన ప్రియసతి, తనలో సగభాగంగా నిలుపుకున్న పార్వతీదేవి మరణానికి కారణమైన దక్షుడు ఇకపై ఎప్పుడూ అలాంటి పని చేయకూడదనుకున్నాడు. పట్టలేని ఆగ్రహంతో తాండవం ఆడాడు. తన జడల్లోంచి ఓ పాయను తీసి నేలకేసి కొట్టగా.. ఆ నిప్పుల్లోంచి వీరభద్రుడు ఉదయించాడు. కోరమీసాలతో, భయంకరమైన రూపంతో, బహు బాహువులతో, అనేక ఆయుధాలతో పట్టసం అనే ఖడ్గాన్ని చేతబూని తండ్రి శివయ్య నుంచి ఆజ్ఞ తీసుకొని దక్షుడు చేస్తున్న యజ్ఞవాటికకు వెళ్లి విధ్వంసం సృష్టించాడు. తండ్రిని అవమానించేందుకు తలపెట్టిన యజ్ఞశాలలను అగ్నికి ఆహుతి చేశాడు. అడ్డుకోవడానికి వచ్చిన దక్షుడి పరివారాన్ని, దేవతా గణాలను సైతం చీల్చి చెండాడాడు. ఆ ఉగ్రరూపానికి మహామహులందరూ తలోదిక్కు పరారయ్యారు. అహంకరించి తండ్రిని అవమానించినందుకు, తల్లి పార్వతి దహనానికి కారణమైన దక్షుడి తల నరికేశాడు. ఆ తరువాత అందరి కోరిక మేరకు మేక తల తొడిగి కాపాడారు. అది వేరే కథ. దీన్ని మించిన సర్జికల్ స్ట్రయిక్ బహుశా మన పురాణగాథల్లో ఎక్కడా కనిపించదు. పరమశివుడు తలపెట్టిన ఆనాటి సర్జికల్ స్ట్రయిక్ ను అత్యంత కచ్చితత్వంతో పూర్తి చేసిన శివాంశ సంభూతుడే వీరభద్రస్వామి. వీరభద్రుడికి దేశమంతటా అనేక ప్రాంతాల్లో దేవాలయాలు ఉన్నాయి. 
వీరభద్రస్వామి కొలువైన కొత్తకొండ
పాత కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వెలసిన శ్రీ వీరభద్రస్వామి పుణ్యక్షేత్రం తెలంగాణలోని ప్రముఖ శైవాలయాల్లో ఒకటి. ఆసియా ఖండంలో ఖ్యాతికెక్కిన పాల సహకార సంఘం, ముల్కనూరుకు కేవలం 5 కి.మీ. దూరంలోనే ఉందీ క్షేత్రం. తొలుత కొండ మీదనే స్వామి ఉండేవాడంటారు. అయితే భక్తులందరికీ అందుబాటులో ఉండడానికి వీలుగా కొన్ని తరాల క్రితమే కిందికి తీసుకొచ్చారు. ఎత్తయిన కొండ పైనుంచి వీరభద్రుణ్ని జాగ్రత్తగా దింపటానికి చాలా మొత్తంలో దూదిని వాడారట. ఆ పని చేసింది స్థానిక కుమ్మరులే అని స్థల పురాణం చెబుతుంది. అయితే స్వామిని కిందికి దింపే క్రమంలో ఆయన కాలు విరిగినట్లు స్థానికులు చెబుతుంటారు. అందుకే విగ్రహం రెండు కాళ్లు సమానంగాా ఉండవు అంటారు. నిరాడంబరుడైన తెలంగాణ సహజకవి బమ్మెర పోతన రాసిన పురాణేతిహాసమే వీరభద్ర విజయం. విజయానికి చిరునామా వీరభద్రుడేనని ఇంతకన్నా చెప్పాల్సింది లేదంటారు అనుభవజ్ఞులు.

కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయాన్ని రాళ్ల మధ్య నిర్మించారు. ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా ఏడు కోనేరులు నీటితో నిండి ఉండటం వీరభద్రస్వామి మహిమగా ప్రజలు చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరిలో సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారిన సంక్రాంతి ముందురోజు ఇక్కడ భవ్యమైన జాతర జరుగుతుంది. ఈ జాతర ప్రధాన ఆకర్షణగా సంక్రాంతి రోజున పెద్ద సంఖ్యలో ప్రజలు ఎడ్లబండ్లలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నుంచి 10 రోజులపాటు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. 

వీరభద్రుణ్ని ప్రతిష్టించిన వీరబ్రహ్మేంద్రస్వామి
వీరభద్రుడికి వీరబ్రహ్మేంద్రస్వామికి ఓ ఆశ్చర్యకరమైన సామ్యం ఉంది. చిల్లర రాళ్లకు మొక్కుతు ఉంటే చిత్తము చెడురా ఒరే ఒరే.. అని ప్రబోధించిన కాలజ్ఞానకర్త, జగద్గురువు వీరబ్రహ్మేంద్రస్వామి కడప జిల్లాలోని అల్లాడుపల్లెలో స్వహస్తాలతో వీరభద్రుడి శిల్పాన్ని చెక్కి ప్రతిష్టించారు. అల్లాడుపల్లె వీరభద్రుణ్ని  దర్శించుకోవడానికి రాయలసీమ నుంచే గాక కర్నాటక నుంచి పెద్దసంఖ్యలో క్యూ కడతారు భక్తులు. తలపెట్టిన పనిని పక్కాగా పూర్తి చేసే శక్తి వీరభద్రుడికి ఉందని.. ఆయన్ని ఆరాధిస్తే శత్రువులపై విజయం ఖాయమని మహానుభావులు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి స్వయంగా వీరభద్రుణ్ని ప్రతిష్టించడం అందుకు ఓ తిరుగులేని తార్కాణంగా భావిస్తారు. కొత్తకొండకు వచ్చే భక్తులు కూడా తాము కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా వీరభద్రుణ్ని కొలుస్తారు. 

ఈ సంవత్సరం (2023) జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈఓ కిషన్ రావు చెప్పారు. 10వ తేదీ, మంగళవారం సా. 6-20కి శ్రీ వీరభద్రస్వామి-భద్రకాళీమాత కళ్యాణం, 14వ తేదీన భోగీ పండుగ, 15వ తేదీ సంక్రాంతి రోజున బండ్లు తిరగడం, 16వ తేదీ నాగవెల్లి, 17వ తేదీ త్రిశూల స్నానం, 18వ తేదీ అగ్నిగుండాలు వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయని కిషన్ రావు చెప్పారు. 

Comments

Post a Comment

Your Comments Please:

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

మోడాల చంద్రశేఖర్ కు గౌరవ డాక్టరేట్

సీనియర్ పాత్రికేయుడు మోడాల చంద్రశేఖర్ కు జి.హెచ్.పి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి విహార్, శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ 34 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పలు పరిశోధనాత్మకమైన కథనాలు అందించారు. అంతేకాకుండా ధ్యాన సైన్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన యూనివర్శిటీవారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఆయన సేవలకు గాను ఇప్పటికే రాష్ట్రస్థాయిలో స్ఫూర్తి రత్న వంటి అవార్డులు, ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శీటీ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డా. పి.రవీందర్, చెన్నయ్ సైబర్ క్రైమ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తంగరాజు, ఎన్ఏఐ జనరల్ సెక్రటరీ డా.విపుణ్ గౌర్, జీహెచ్ పీయు తమిళనాడు, పాండిచ్చేరి రీజియన్ జాయింట్ డైరెక్టర్ లు డా. వళ్ళార్ మతి, శుభాస్ షా, నామినేషన్ కమిటీ మెంబర్ బొడుసు మాధవి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు అందజేసి తన బాధ్యతను మరింత పెంచిన ...