Skip to main content

రాజ్ ‎కుమార్ ఖాతాలో అవార్డులు, రివార్డులు, ప్రశంసాపత్రాలు

ఆయన అవార్డుల కోసం పని చేయడు. అయినా అవార్డులు వెదుక్కుంటూ ఆయన్ని వరిస్తాయి. పని పట్ల ఆయన చూపే బాధ్యతే ఆయన వెంట అవార్డులు క్యూ కట్టేలా చేసిందంటే అతిశయోక్తి కాదంటారు ఆయన స్నేహితులు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీ పీఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎస్.రాజ్‎కుమార్ ను ఇప్పటికే అనేక అవార్డులు వరించాయి. తాజాగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్‎కుమార్ తన సేవలకు గాను ప్రశంసా పత్రం అందుకున్నారు. 

రాజ్‎కుమార్ ఇప్పటికే 38 ఉత్తమ సేవా పురస్కారు, 24 నగదు పురస్కారాలు, మరో 4 ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 2000 సంవత్సరం బ్యాచ్ కు చెందిన రాజ్‎కుమార్ రెగ్యులర్ పోలీస్ డ్యూటీలే గాక, అధికారులు అప్పగించే ప్రత్యేకమైన టాస్కులు, డ్రాఫ్టింగ్ వంటి ఏ పనులు అప్పగించినా అన్నింటా తన అంకితభావాన్ని ప్రదర్శిస్తారు. అది చూసే రాజ్‎కుమార్ కోసమే పోలీస్ అధికారులు పలు ప్రత్యేకమైన పనులు అప్పగిస్తారన్న టాక్ కరీంనగర్ జిల్లాలో వినిపిస్తుంది. తాజా కార్యక్రమంలో ఎల్ఎండీ పోలీసులకు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్ఐ శీలం ప్రమోద్‎రెడ్డి, ఏఎస్ఐ నజీముద్దీన్, హెడ్ కానిస్టేబుల్ లింగారెడ్డి, శంకర్, ఆంజనేయులు, కానిస్టేబుల్ శ్రీనివాస్, హోంగార్డు లక్ష్మీనారాయణలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు చేతులు మీదుగా వారు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. అవార్డు గ్రహీతలకు సీఐ పర్శ రమేశ్, ఎస్ఐ ప్రమోద్ రెడ్డి అభినందలు తెలిపారు. 


Comments

Post a Comment

Your Comments Please:

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.