Skip to main content

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ మాజీ భార్య కామెంట్లు

ఏపీ రాజకీయాల్లో "కీ రోల్" పోషించాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ కు.. టైగర్ నాగేశ్వరరావు ఇబ్బందికరంగా మారాడట. అదేంటి? టైగర్ నాగేశ్వరరావుతో పవన కళ్యాణ్ కు వచ్చిన ఇబ్బందేంటి? అని ఆశ్చర్యపోతున్నారు కదా. పవన్ రెండో భార్య రేణూ దేశాయ్.. అందులో "కీ రోల్" పోషించడం.. ఆ సినిమా ఫంక్షన్ లో రేణూ మాట్లాడిన మాటలు పవన్ ను పరోక్షంగా టచ్ చేయడం వంటి కారణాలతో ఆయన ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పిస్తున్నాయట. ఇంతకీ రేణూ ఏమంది? ఆమె మాటలు పవన్ కెరీర్ కు ఎలా ఎఫెక్ట్ అవుతాయి? 

Read this also: హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరై.. తన వ్యక్తిగత విషయాలతో పాటు తన గత విషయాల గురించి కూడా చెప్పుకున్నారు రేణూ దేశాయ్. అయితే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించాలని.. అదృష్టం కలిసొస్తే సీఎం అవ్వాలని కలలు కంటున్నారు. ఈ క్రమంలో తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఫంక్షన్లో రేణూదేశాయి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పవన్ కు సంబంధించి ఎదురైన ప్రశ్నలకు పెద్దగా రెస్పాండ్ కాని రేణూ.. అతను సీఎం కావాలని మీరు కోరుకుంటున్నారా..? అనే ప్రశ్నకు సైతం ఒకింత కటువుగానే స్పందించారంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్. ఒక పొలిటీషియన్‌గా అతను ఈ సొసైటీకి అవసరమని మాత్రమే గతంలో ఓ వీడియో ద్వారా చెప్పానని.. అది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చారు. ఇక సీఎం అవుతారా లేదా అనేది మాత్రం తాను కోరుకోనని చెప్పడం.. పవన్ ఫ్యాన్స్ లోనే గాక.. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఆసక్తి రేపుతోంది. అక్కడితో ఆగకుండా.. దేవుడు ఉన్నాడని.. ఏ విషయమైనా ఆయనే డిసైడ్‌ చేస్తాడని.. కనీసం ఒక కామన్‌ వ్యక్తిగా కూడా ఆయన వైపు స్టాండ్‌ తీసుకోనని రేణూ తేల్చి చెప్పడం దుమారం రేపుతోంది. 

పవన్ కళ్యాణ్  తన పిల్లలికి తండ్రిగా ఉంటారు... అంతే తప్ప ఆయన రాజకీయ జీవితం గురించి తాను మాట్లాడబోనని ఖండితంగా చెప్పారు రేణు. ఫలానా వ్యక్తిని సపోర్ట్‌ చేయండి అంటూ తనకు ఎన్నికల ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. పవన్‌ గురించి తాను ప్రతిసారీ నిజాలే చెప్పానని.. విడాకుల సమయంలో చెప్పినవి కూడా అన్నీ నిజాలేనని.. కొద్దిరోజుల క్రితం పవన్‌ గురించి చెప్పిన మాటల్లో కూడా నిజమే ఉందని... కావాలంటే లై డిటెక్టర్‌ పెట్టి చెక్‌ చేసుకోవచ్చునని రేణు చెప్పడం పవన్ ఫ్యాన్స్ లో కలకలం రేపుతోంది. 

ఒక మంచి పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ సొసైటీకి ఎంతో అవసరం అని తాను గత వీడియోలలో తెలియజేశానని... అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనన్నారు రేణూ. ఆయన సీఎం అవ్వాలని తాను కోరుకోవడం లేదని.. తనలో గూడు కట్టుకున్న గాఢమైన అభిప్రాయాన్ని అంతే గాఢంగా రేణూ చెప్పారంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక కామన్ మ్యాన్ గా కూడా తాను పవన్ కళ్యాణ్ పట్ల స్టాండ్ తీసుకోను అంటూ.. రేణు పవన్ పొలిటికల్ జర్నీ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలని.. టీడీపీ పొత్తును ఆసరా చేసుకొని వీలైనన్ని ఎక్కువ సీట్లు సొంతం చేసుకోవాలని జనసేన అధినేత చురుగ్గా పావులు కదుపుతున్నారు. అవకాశం వస్తే తప్పకుండా సీఎం పదవి అధిరోహిస్తానని పదేపదే చెప్తున్నారు. ఈ క్రమంలో పవన్ మాజీ సతీమణి రేణు చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ పై ప్రభావం చూపిస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. పవన్ కు లోకల్ భార్య ఒకరు.. నేషనల్ భార్య ఒకరు.. ఇంటర్నేషనల్ భార్య ఒకరు అంటూ జగన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ వైవాహిక జీవితాన్ని రాజకీయంగా వాడుకోజూస్తున్న వైసీపీకి.. ఇప్పుడు రేణూ చేసిన వ్యాఖ్యలు ఉపయుక్తంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. మరి.. దీనికి పవన్ మళ్లీ ఎలా రెస్పాండ్ అవుతారోనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.