Skip to main content

ఎంబీసీ జాతిపిత కాళప్ప 75వ బర్త్ డే వేడుకలు

అత్యంత వెనుకబడిన కులాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి మెప్పించిన కె.సి.కాళప్ప జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య నిరాడంబరంగా జరిగాయి. ఆదివారం హైదరాబాద్ బండ్లగూడలోని తన స్వగృహంలో కాళప్ప 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంబీసీల్లోని పలు కులాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తమ కులాల అభ్యున్నతి కోసం కాళప్ప చేసిన కృషిని అంతా గుర్తు చేసుకున్నారు. కాళప్ప అనారోగ్యానికి గురైన తరువాత ఎంబీసీ ఎజెండా చలనం లేకుండా పోవడంపై పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం వరకు కాళప్ప పూర్తి ఆరోగ్యంగా ఉండి యావత్ ఎంబీసీల ఎజెండాను పరుగులు పెట్టించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. 


2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించి.. అందుకోసం సామాజిక అధ్యయనం చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టారు. ఆ సమయంలో బీసీల్లో ఉన్న మోస్ట్ బ్యాక్‎వార్డ్ క్యాస్ట్స్ (ఎంబీసీ) కు కూడా సమన్యాయం, సహజ న్యాయం జరగాలనే బలమైన వాయిస్ వినిపించారు కాళప్ప. బీసీల్లో ఉన్న దాదాపు నూటపాతిక కులాల్లో కేవలం 5 పెద్ద కులాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందుకుంటున్నాయని.. మిగతా కులాలు.. అదే బీసీ ల చేతుల్లో అణచివేతకు, అన్యాయానికి గురవుతున్నారని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సామాజిక అసమానతల్లోని లోతును విడమరచి చెప్పారు. దాదాపు 7 గంటల పాటు కేసీఆర్ కు ప్రజెంటేషన్ ద్వారా వివరించడంతో కేసీఆర్.. ఎంబీసీలకు న్యాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అలా కాళప్ప కృషి ఫలితంగానే ఎంబీసీ కార్పొరేషన్ కు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఎంబీసీల జీవితాల్లో ఇక వెలుగులు ప్రసరిస్తాయని అంతా ఆశించారు. అయితే కేసీఆర్ ఇచ్చిన హామీ.. హామీగానే మిగిలిపోయింది. ఈ లోపు కాళప్ప అనారోగ్యం బారిన పడి రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. మరోవైపు ఎంబీసీ చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన తాడూరి శ్రీనివాస్ ను నియమించడంతో.. కాళప్ప అనుయాయుల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. ఎంబీసీలపై అవగాహన లేని, వారి సంక్షేమం విషయంలో చిత్తశుద్ధి లేని శ్రీనివాస్ ను ఎంబీసీ చైర్మన్ గా నియమించడంతోనే కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలోని లోగుట్టు రట్టయ్యిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో కాళప్ప పూర్తిగా మంచానికే పరిమితం అవడంతో ఎంబీసీల అసలైన ఎజెండా ముందుకు వెళ్లకుండా ఆగిపోయిందని.. ఎంబీసీ కులాల నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కాళప్ప ఎజెండా ముందుకు ఏ విధంగా వెళ్తుందన్న చర్చ మిగతా ఎంబీసీ నేతల్లో జరుగుతోంది.

కాళప్పను కలిసి అభినందించినవారిలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు లక్ష్మణాచారి, ఆరెకటిక నాయకుడు ప్రేమలాల్ అండ్ టీమ్, సీనియర్ పాత్రికేయుడు టి.రమేశ్‎బాబు, ఎం.నరసింహాచారి తదితరులు ఉన్నారు. 

Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

మోడాల చంద్రశేఖర్ కు గౌరవ డాక్టరేట్

సీనియర్ పాత్రికేయుడు మోడాల చంద్రశేఖర్ కు జి.హెచ్.పి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి విహార్, శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ 34 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పలు పరిశోధనాత్మకమైన కథనాలు అందించారు. అంతేకాకుండా ధ్యాన సైన్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన యూనివర్శిటీవారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఆయన సేవలకు గాను ఇప్పటికే రాష్ట్రస్థాయిలో స్ఫూర్తి రత్న వంటి అవార్డులు, ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శీటీ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డా. పి.రవీందర్, చెన్నయ్ సైబర్ క్రైమ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తంగరాజు, ఎన్ఏఐ జనరల్ సెక్రటరీ డా.విపుణ్ గౌర్, జీహెచ్ పీయు తమిళనాడు, పాండిచ్చేరి రీజియన్ జాయింట్ డైరెక్టర్ లు డా. వళ్ళార్ మతి, శుభాస్ షా, నామినేషన్ కమిటీ మెంబర్ బొడుసు మాధవి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు అందజేసి తన బాధ్యతను మరింత పెంచిన ...